ప్రియుడే చంపాడా : కూకట్‌పల్లిలో యువతి మిస్టరీ డెత్

కూకట్ పల్లిలో దారుణం జరిగింది. జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

  • Published By: veegamteam ,Published On : April 16, 2019 / 01:58 PM IST
ప్రియుడే చంపాడా : కూకట్‌పల్లిలో యువతి మిస్టరీ డెత్

కూకట్ పల్లిలో దారుణం జరిగింది. జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.

హైదరాబాద్ : కూకట్ పల్లిలో దారుణం జరిగింది. జ్యోతి అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. జ్యోతి మృతికి ప్రియుడు రాకేష్ కారణం అని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. జ్యోతికి కూల్ డ్రింక్ లో విషం కలిపి ఇచ్చి చంపేశాడని, ఎవరికీ అనుమానం రాకుండా ఆసుపత్రిలో జాయిన్ చేసి పారిపోయాడని అంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతోనే జ్యోతిని హత్య చేశాడనే అనుమానం వ్యక్తం చేశారు.
Read Also : ఫేస్ బుక్ LIVE అద్భుత ప్రయోగం : దేశంలోనే ఫస్ట్ టైం అంబులెన్స్ కు 600 కిలోమీటర్ల ట్రాఫిక్ క్లియరెన్స్

జ్యోతి తన ప్రియుడు రాకేష్ తో కలిసి సోమవారం(ఏప్రిల్ 15,2019) రాత్రి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ జ్యోతి చనిపోయింది. ఆమెను అనుపమ ఆసుపత్రిలో చేర్పించి పారిపోయాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. జ్యోతి విషం కలిపిన కూల్ డ్రింక్ తాగి చనిపోయిందా మరో కారణమా అని తెలుసుకునే పనిలో ఉన్నారు.

పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాక మృతికి కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసుల చెప్పారు. పక్కా ప్లాన్ ప్రకారమే తమ కూతురిని రాకేష్ చంపేశాడని జ్యోతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాకేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పరారీలో ఉన్న రాకేష్ ని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్ రంగంలోకి దిగింది.
Read Also : ఇక పోదాం పదండీ : చంద్రుడిపై నీళ్లు ఉన్నాయి