Heart Attack : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విషాదం నెలకొంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో శనిగరం ఆంజనేయులు అనే యువకుడు బౌలింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Heart Attack : క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

Heart Attack

Heart Attack : తెలంగాణలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండె పోటు మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న పిల్లలు మొదులుకొని పెద్ద వయస్సు కలిగిన వారు గుండెపోటుతో మరణిస్తున్నారు. ఇటీవలే 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి చెందిన ఘటన మరువకముందే మరో విషాదం నెలకొంది.

తాజాగా క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేఎమ్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ లో శనిగరం ఆంజనేయులు అనే యువకుడు బౌలింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

Mahabubabad : 13 ఏళ్ల బాలిక గుండెపోటుతో మృతి.. ఛాతిలో నొప్పి అంతలోనే విషాదం

తోటి యువకులు గుండెపోటు వచ్చిందన్న అనుమానంతో సీపీఆర్ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స కోసం వెంటనే అతన్ని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య సిబ్బంది అతడికి మరోసారి సీపీఆర్ చేసినా ఫలితం లేకండా పోయింది.  అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.

మృతుడు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సందరగిరి గ్రామానికి చెందిన శనిగరం ఆంజనేయులుగా గుర్తించారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాకారులు కన్నీరుమున్నీరయ్యారు. అతడి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.