Eluru : ప్రేమించలేదని విద్యార్థినిపై వేడి నూనే పోసిన యువకుడు

యువతి చేతులు, కాళ్లపై గాయాలు అయ్యాయి. యువతిని చికిత్స కోసం తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.

Eluru : ప్రేమించలేదని విద్యార్థినిపై వేడి నూనే పోసిన యువకుడు

Eluru

Eluru : ఏలూరు జిల్లా పెద్దవేగి మండలం దుగ్గిరాలలో దారుణం జరిగింది. ప్రేమించలేదని ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై యువకుడు వేడి నూనే పోశాడు. ప్రేమించలేదని ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై అనుదీప్ అనే విద్యార్థి వేడి నూనే పోశాడు. గదిలో బంధించి యువతి ఒంటిపై వేడి నూనే పోశాడు. యువతి ప్రేమించలేదన్న కోపంతో దాడి చేశాడు.

అనుదీప్ నుంచి తప్పించుకున్న యువతి.. ఆమె తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. యువతి చేతులు, కాళ్లపై గాయాలు అయ్యాయి. యువతిని చికిత్స కోసం తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు.
దుగ్గిరాలకు చెందిన శిరీష కాకినాడలోని ఓ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నారు.

Man Shoots Girl : దారుణం.. ప్రేమించలేదని టెన్త్ క్లాస్ బాలికను తుపాకీతో కాల్చిన ప్రేమోన్మాది

ఈ నేపథ్యంలో ప్రేమ పేరుతో అనుదీప్ శిరీషను ట్రాప్ చేశారు. గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాంటూ ఆమె వెంట పడుతున్నాడు. యువకుడి మాటలు నమ్మిన శిరీష కాకినాడలోని కాలేజీ నుంచి దుగ్గిరాలోని అనుదీప్ ఇంటికి వచ్చారు. అనుదీప్ శిరీషను గదిలో బంధించి రకరకాలుగా ఆమెను చిత్ర హింసులకు గురి చేస్తున్నాడు.

పెళ్లి చేసుకుంటానని ఆమెను శారీరకంగా ఇబ్బంది పెడుతున్నక్రమంలో ఆమె తలగ్గక్కపోవడంతో ఆమె కాళ్లు, చేతులు కట్టేసి చిత్ర హింసలకు గురి చేసినట్టుగా బాధిత యువతి వాపోయారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.