Vijayawada : ప్రియురాలి మేనమామను కత్తితో పొడిచి చంపిన ప్రియుడు

ప్రేమించిన యువకుడితోనే జీవితం పంచుకోవాలని భావించిన శ్వేత ఇటీవల ఇంటి నుంచి పారిపోయారు. విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ పరిధిలోని హుజూర్ నగర్ లో నవీన్ ఇంటికి వెళ్లి పోయింది.

Vijayawada : ప్రియురాలి మేనమామను కత్తితో పొడిచి చంపిన ప్రియుడు

Vijayawada

Vijayawada : ఏపీలో ప్రేమ వ్యవహారం ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రేమించిన యువకుడి కోసం ఇంటి నుంచి పారిపోయిన యువతిని తీసుకొచ్చేందుకు వెళ్లిన మేనమామ హత్యకు గురయ్యాడు. యువతి మేనమామను ప్రియుడు దారుణంగా హత మార్చాడు. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన నవీన్, ఒంగోలుకు చెందిన శ్వేత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

ప్రేమించిన యువకుడితోనే జీవితం పంచుకోవాలని భావించిన శ్వేత ఇటీవల ఇంటి నుంచి పారిపోయారు. విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ పరిధిలోని హుజూర్ నగర్ లో నవీన్ ఇంటికి వెళ్లి పోయింది. ఈ విషయం తెలుసుకున్న శ్వేత కుటుంబ సభ్యులు కూడా విజయవాడకు వెళ్లారు. చిట్టినగర్ లో నివాసం ఉంటున్న శ్వేత మేనమామ శ్రీనివాస్ ను వెంటబెట్టుకుని బుధవారం(ఏప్రిల్19)న సాయంత్రం నవీన్ ఇంటికి వెళ్లారు.

Drug Addict Stabs : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. డ్రగ్స్ మానేయమని చెప్పిన మేనమామను పొడిచి పొడిచి చంపేశాడు

నవీన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్వేతను తీసుకొచ్చారు. కానీ ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే శ్వేత ఇంటి మళ్లీ పారిపోయారు. దీంతో శ్వేతను ఎలాగైనా బుజ్జగించి తీసుకొద్దామని ఆమె కుటుంబసభ్యులు మళ్లీ నవీన్ ఇంటికి వెళ్లారు. శ్వేత ఎక్కడ అని నవీన్ ను నిలదీశారు. ‘నా దగ్గర నుంచి మీరే తీసుకెళ్లి.. ఇప్పుడొచ్చి మళ్లీ నన్నే ప్రశ్నిస్తున్నారా?’ అంటూ శ్వేత బంధువులతో నవీన్ ఘర్షణ పడ్డారు.

శ్వేత కుటుంబ సభ్యులు కూడా వెనక్కి తగ్గకపోవడంతో గొడవ మరింత ముదిరింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన నవీన్… శ్వేత మేనమామ శ్రీనివాస్ పై కత్తితో దాడి చేశారు. ఛాతిలో బలంగా కత్తితో పొడిచారు. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. వెంటనే బంధువులు అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.