పెళ్లి ఆలస్యం అవుతోందని 19ఏళ్ల యువతి ఆత్మహత్య

  • Published By: naveen ,Published On : September 8, 2020 / 12:25 PM IST
పెళ్లి ఆలస్యం అవుతోందని 19ఏళ్ల యువతి ఆత్మహత్య

మానవ జన్మ దేవుడిచ్చిన వరం. కానీ కొంతమందికి దాని విలువ తెలియడం లేదు. చిన్న చిన్న కారణాలకే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. తన పెళ్లి ఆలస్యం అవుతోందనే బెంగతో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.



బెజ్జంకి మండలం ఎల్లంపల్లికి చెందిన వడిగె శిరీష (19) డిగ్రీ పూర్తి చేసింది. ఇంటి దగ్గరే ఉంటోంది. కోహెడ మండలం మైసంపల్లికి చెందిన వజ్జెపల్లి శ్రావణ్‌, తను మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువైపులా తల్లిదండ్రులు వారి పెళ్లికి అంగీకరించారు. శిరీష తండ్రి నర్సింగం సౌదీ అరేబియాలో గొర్ల కాపరిగా పని చేస్తున్నారు. ఆమె తల్లి ఇక్కడ వ్యవసాయ కూలీ.
https://10tv.in/lady-superstar-nayanthara-and-her-fiance-vignesh-shivan-celebrate-onam-in-kerala/
శిరీషకు పెళ్లయిన అక్క ఉంది. ప్రస్తుత కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విమానాలు నడవక తండ్రి నర్సింగం భారత్‌కు రాలేకపోయారు. తండ్రి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందువని తల్లి పలుమార్లు సముదాయించింది. అయినా పెళ్లి ఆలస్యం అవుతోందనే చింతతో ఆగస్టు 28న శిరీష పురుగుమందు తాగింది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం(సెప్టెంబర్ 6,2020) రాత్రి మృతి చెందింది. శిరీష మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. శిరీష్ ఇంత పని చేస్తుందని అసలు ఊహించలేదని తల్లి కన్నీరుమున్నీరు అయ్యింది.