Young Woman Died : విహారంలో విషాదం-కారులోంచి తల బయటపెట్టటంతో ప్రాణమే పోయింది

పశ్చిమగోదావరి జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన వారికి విషాదం మిగిలింది. చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టి కూర్చుంటే రోడ్డు పక్కన కరెంట్ స్తంభం తగిలి ప్రాణాలు వదిలిందో యువతి.

Young Woman Died : విహారంలో విషాదం-కారులోంచి తల బయటపెట్టటంతో ప్రాణమే పోయింది

Dead Body

Young Woman Died : పశ్చిమగోదావరి జిల్లాలో విహార యాత్రకు వెళ్లిన వారికి విషాదం మిగిలింది. చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టి కూర్చుంటే రోడ్డు పక్కన కరెంట్ స్తంభం తగిలి ప్రాణాలు వదిలిందో యువతి.

పశ్చిమగోదావరి జిల్లా గౌరీపట్నం నుంచి ఎనిమిది మంది స్నేహితులు శనివారం ఒకకారులో మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. మధురపూడి విమానాశ్రయం గేటు-బూరుగుపూడి గ్రామం మధ్య కారు వెళుతుండగా కారులోని వల్లభనేని లోహితరాణి(25) అనే యువతి కారులోంచి తల బయటపెట్టి చల్ల గాలిని ఆస్వాదిస్తూ ప్రకృతి అందాలను తిలకిస్తోంది.

అదే సమయంలో కారు రోడ్డు మార్జిన్ దిగి వెళ్తూ ఉండటంతో పక్కనే ఉన్న కరెంట్ స్తంభానికి ఆమె తల బలంగా తాకింది. స్నేహితులు వెంటనే ఆమెను  కారులో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది స్నేహితురాళ్ళు రావులపాలెంలో జరిగే స్నేహితురాలి పెళ్లికి వచ్చారు.  వీరు లోహిత్ రాణి స్వగ్రామంల గౌరీపట్నంలో బస చేసారు. పెళ్లి అయిపోయిన అనంతరం విహార యాత్రకు వెళ్లాలనుకునే సరికి విషాదం చోటు చేసుకుంది. ఎనిమిది మంది స్నేహితురాళ్లలో ఆరుగురు చెన్నైలో సీఏలుగా పనిచేస్తున్నారు. మరో ఇద్దరు బీటెక్ చేశారు. లోహిత్ రాణి తల్లి తండ్రులకు ఆమె ఒక్కత్తె సంతానం. వారూ అనారోగ్యంతో ఉన్నారని తెలుస్తోంది.