ప్రేమిస్తోందని జుట్టు కత్తిరించిన తల్లితండ్రులు-యువతి ఆత్మహత్య

కాలేజీలో చదువుతున్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న పెద్దలు ఆమె బయటకు వెళ్ళకుండా జుట్టు కత్తిరించి ఇంటికే పరిమితం చేశారు. ఇది తట్టుకోలేని విద్యార్ధిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు బలవన్మరణానికి పాల్పడింది.

ప్రేమిస్తోందని జుట్టు కత్తిరించిన తల్లితండ్రులు-యువతి ఆత్మహత్య

young woman end life, due to love affair, harassment, hyderabad : కాలేజీలో చదువుతున్న కూతురు ప్రేమలో పడిందని తెలుసుకున్న పెద్దలు ఆమె బయటకు వెళ్ళకుండా జుట్టు కత్తిరించి ఇంటికే పరిమితం చేశారు. ఇది తట్టుకోలేని విద్యార్ధిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు బలవన్మరణానికి పాల్పడింది.

స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం …… ఒరిస్సాకు  చెందిన పరమేశ్వర్ 20 ఏళ్ల కిందట హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లి సమీపంలోని లక్ష్మీగూడకు వచ్చి జీవనం సాగించసాగాడు.  అతనికి నలుగురు పిల్లలు. వారిలో చిన్న కూతురు లీజా(20) అదే ప్రాంతానికి చెందిన అక్రం, అలియాస్ అఫ్సర్ (20) అనే యువకుడి ప్రేమలో పడింది.

ఇద్దరూ ఇంటర్ లో ఒకే కళాశాలలో చదువుకున్నారు. దానితో కాలేజీకి వచ్చిపోయే క్రమంలో వీరి ప్రేమ మరింత బలపడింది. ఈ విషయాన్ని గమనించిన పరమేశ్వర్ కుటుంబ సభ్యులు తమ కూతుర్ని హెచ్చరించారు. మరో వైపు అఫ్సర్ ను  కూడా పలుమార్లు హెచ్చరించారు…. తమ కుమార్తెతో ప్రేమ వ్యవహారం మానుకోమని. అయినా వీరి ప్రేమ కొనసాగుతూనే ఉంది.

దీంతో లీజా కుటుంబ సభ్యులు ఆమెను బయటకు వెళ్లనీయకుండా ఉంచేందుకు జుట్టు కత్తిరించి ఆమెను ఇంట్లోనే బంధించారు.  ఈ ఘటనతో ఆ యువతి మానసికంగా కుంగి పోయింది. దీనికి తోడు అఫ్సర్ తరచూ ఆమెకు ఫోన్ చేసి వేధించసాగాడు. ఒక వైపు కుటుంబ సభ్యుల నిర్భంధం.. మరోక వైపు ప్రియుడి ఫోన్లు …. ఈ రెండిటి మధ్య …సోమవారం లీజా ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని తనువు చాలించింది.

ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు ప్రియుడితో సుమారు గంటపాటు ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమె  మరణించాక కూడా అఫ్సర్ 135 సార్లు ఆమెకు ఫోన్ చేసాడు. ఈ క్రమంలో ఆమె ప్రియుడితో మాట్లాడుతూనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్నేహితులు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు అఫ్సర్ ను రిమాండ్ కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.