Telangana : మెడలో తాళిబొట్టు తీసి సీఐ మీదకు విసిరేసిన మహిళ 

మెడలో తాళిబొట్టు తీసి సీఐ మీదకు విసిరేసింది ఓ మహిళ . తన భర్తను చంపిన వ్యక్తికి సీఐ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ మెడలో తాళిబొట్టు తీసి విసిరేసింది.

Telangana : మెడలో తాళిబొట్టు తీసి సీఐ మీదకు విసిరేసిన మహిళ 

Telangana Crime

Telangana crime : రాజన్న సిరిసిల్ల జిల్లా రుంద్రంగి పోలీసు స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మహిళ తన భర్తను హత్య చేసినవారికి సీఐ సహకరించారని ఆరోపిస్తూ..‘నా తాళి బొట్టు తెంపేశారు..ఇక ఇది నాకెందుకు అంటూ తన మెడలోని మంగళసూత్రాన్ని తీసి సీఐమీదకు విసిరేసింది. దీంతో బాధిత మహిళతో పాటు వచ్చినవారు పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆస్తి తగాదాల్లో తమ్ముడు కిషన్ అన్న నరసయ్యను ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్ లో లొంగిపోయాడు. కిషన్ పోలీసు స్టేషన్ లో ఉన్నాడని తెలుసుకున్న మృతుడి భార్య బంధువులు..గ్రామస్థుల రుద్రంగి పోలీసు స్టేషన్ ముట్టడించారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కిషన్ ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.అనంతరం పోలీసు స్టేషన్ ను ముట్టడించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు.కి ఎస్సై, సీఐ సహకరించారు అని ఆరోపిస్తూ..మృతుడు నర్సయ్య భార్య తన మెడలో తాళిబొట్టు తీసి సీఐ మీదకు విసిరేసింది.

గత కొంతకాలంలో కిషన్ కు, నర్సయ్యకు భూ సరిహద్దుల విషయంలో తగాదాలు ఉన్నాయి. ఈక్రమంలో అన్న నర్సయ్య పోలీసులకు తన గోడు వెళ్లబోసుకున్నాడు. కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. దీంతో తమ్ముడు కిషన్ పోలీసులకు డబ్బులిచ్చాడని దీంతో పోలీసులు తమకు న్యాయం చేయకుండా కిషన్ కు సహరించారని..ఆరోపిస్తూ తన భర్త నర్సయ్యను ట్రాక్టర్ తో ఢీకొట్టి చంపిన కిషన్ ను తమకు అప్పగించాలని భార్యా, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.