పక్కింటి వ్యక్తి భార్యతో పారిపోయాడు.. తండ్రి మరణంతో తిరిగొచ్చి…!
ఓ యువకుడు పక్కింటి వ్యక్తి భార్యతో పారిపోయాడు. యువకుడి తండ్రి మరణవార్త తెలియగానే తిరిగి ఇంటికి వచ్చారు.
ఓ యువకుడు పక్కింటి వ్యక్తి భార్యతో పారిపోయాడు. యువకుడి తండ్రి మరణవార్త తెలియగానే తిరిగి ఇంటికి వచ్చారు.
ఓ యువకుడు పక్కింటి వ్యక్తి భార్యతో పారిపోయాడు. యువకుడి తండ్రి మరణవార్త తెలియగానే తిరిగి ఇంటికి వచ్చారు. అప్పటికే తండ్రి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముందుగా యువకుడు పురుగుల మందు తాగి.. ఆపై ఆమెకు తాగించాడు. అనంతరం ఇద్దరూ స్థానిక వాటర్ ట్యాంక్ పైకెక్కారు. యువకుడు కిందకు దూకి చనిపోగా… మహిళను స్థానికులు కాపాడారు. ఈ సంఘటన మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం… నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి తాలుక, రఘుపతి పేట గ్రామానికి చెందిన రాము(24), మమత దంపతులు. వీరికి కూతురు ఉంది. దంపతులిద్దరూ 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చారు. బడంగ్పేట మున్సిపల్ పరిధిలోని అల్మాస్గూడ రాజీవ్ గృహకల్ప బ్లాక్-30లో నివాసం ఉంటున్నారు. రాము రాజీవ్ గృహకల్పకు చెందిన గోవింద్ అనే కాంట్రాక్టర్ వద్ద మేస్త్రీగా పని చేసేవాడు. గోవింద్ గృహకల్పలోని బ్లాక్-29లో నివాసం ఉంటున్నాడు.
కాగా.. రాము తరచూ గోవింద్ ఇంటికి వస్తుండగా అతని భార్యతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 10 రోజుల క్రితం రాము, గోవింద్ భార్యతో కలిసి బయటకు వెళ్లిపోయాడు. దీంతో గోవింద్ మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాము తండ్రి సోమవారం రాజీవ్ గృహకల్పలో అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాము.. మహిళతో ఇంటికి వచ్చాడు. అప్పటికే తండ్రి అంత్యక్రియలు ముగిశాయి.
దీంతో మనస్తాపానికి గురైన రాము పురుగుల మందు తాగి… ఆపై మహిళకు కూడా తాగించాడు. అనంతరం ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడానికి వాటర్ ట్యాంక్ పైకెక్కారు. రాము కిందకు దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుడు ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వివాహేతర సంబంధం కారణంగా స్థానికులు ఏమైనా అనుకుంటారనుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
See Also | మహిళలే వారి టార్గెట్…పెళ్లి చేసుకుంటామని నమ్మించి రూ.12.5లక్షలు కాజేసిన విదేశీముఠా