దారుణం : హిజ్రాలపై దాడి 

  • Published By: chvmurthy ,Published On : April 19, 2019 / 08:34 AM IST
దారుణం : హిజ్రాలపై దాడి 

విజయవాడ : విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మద్యం సేవించిన మందు బాబులు కొందరు హిజ్రాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన హిజ్రాలు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో షాపుల దగ్గర డబ్బులు అడుక్కుంటున్న హిజ్రాలు వర్మ అనే వ్యక్తి దగ్గర కూడా డబ్బులు అడిగారు. దాంతో ఆగ్రహించిన వర్మ..మీరు హిజ్రాలు అవునో? కాదో తెలియాలంటే బట్టలు విప్పాలని దౌర్జన్యం చేసాడు. అందుకు హిజ్రాలు అంగీకరించలేదు. దేవుడి శాపంతో మేము హిజ్రాలుగా పుట్టాము. మీరు హిజ్రాగాకాకుండా మగాడిగా పుట్టారు. మాతో మీకెందుకు అని సమాధానం చెప్పారు. 

దీంతో ఆగ్రహించిన వర్మ మరి కొందరిని రెచ్చగొట్టి హిజ్రాలపై కర్రలతో దాడి చేశాడు. హిజ్రాలు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా వారిని రోడ్లపై వెంబడించి బట్టలు చించి, కర్రలతో చితకబాదినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హిజ్రాలు పేర్కోన్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు  విచారణ జరుపుతున్నారు.