-
Home » పంటలను నాశనం చేస్తే…అడవిపందులను వధించవచ్చు
Telangana
పంటలను నాశనం చేస్తే…అడవిపందులను వధించవచ్చు
Published
1 month agoon

Telangana government a key decision : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలను నష్టం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంటలను నాశనం చేస్తూ రైతులకు సమస్యగా మారిన అడవిపందులను వధించడానికి గ్రామ సర్పంచులకు విచక్షణాధికారాన్ని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సర్పంచులను గౌరవ వైల్డ్లైఫ్ వార్డెన్లుగా నియమించింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. పంటలను నాశనం చేస్తున్న సమయంలో మాత్రమే అడవిపందులను వధించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అడవిపందుల వల్ల పంటలకు, ఇతర ఆస్తులకు తీరని నష్టం వాటిల్లుతుందని నిర్ధారణ జరిగినప్పుడు మాత్రమే వాటిని కాల్చిచంపడానికి షూటర్లను అనుమతించాలి తప్ప సాధారణ పరిస్థితులలో కాదని ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
వ్యవసాయ పంటలు, ఉద్యానవనాల పరిధిలోనే కల్లింగ్ ఉండాలి, కానీ ఏ ఇతర ప్రాంతంలోనూ అడవి పందులకు హాని తలపెట్టరాదని ప్రభుత్వం పేర్కొంది. వాస్తవానికి తమ ప్రాంతాలలో విపరీతంగా పెరిగిపోతున్న కొన్ని జాతుల జంతువులు ఆస్తులకు, పంటలకు నష్టం కలిగిస్తున్నాయని వాటిని వర్మిన్ (క్రిమికీటకాలు, ఎలుకలు) ప్రకటించాలని చాలా రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇందులో భాగంగా గుజరాత్లో నీల్గాయి, హిమాచల్ప్రదేశ్లో కోతులను వర్మిన్గా ప్రకటించారు. అయితే దీనివల్ల కొందరు జంతువులను విచక్షణారహితంగా వధిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం వర్మిన్ ప్రతిపాదనల జోలికి వెళ్లడం లేదు.
జంతువులతో తీవ్ర సమస్య ఉంటే చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ అనుమతితో ఆయా గ్రామ పంచాయతీలకు అధికారమివ్వవచ్చని నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్లైఫ్ స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంటలకు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్న జంతువులను వధించడానికి 2010లో ఉమ్మడి రాష్ట్రంలో డీఎఫ్వోలకు అధికారాలనిచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015-16లో డీఎఫ్వోల అధికారాలను పునరుద్ధరించారు. కానీ డీఎఫ్వోలు నిర్ణయం తీసుకోవడంలో చాలా జాప్యం జరుగుతున్నందున గ్రామ పంచాయతీలకు అధికారాన్ని కట్టబెడుతూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో అడవిపందుల వల్ల తీవ్ర పంట నష్టం జరుగుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు కొన్ని షరతులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ రజత్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
-రైతుల నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదు అందితేనే సర్పంచులు అడవిపందులపై చర్యకు ఉపక్రమించాలి.
-గ్రామ పెద్దలతో కలిసి అడవి పందులు సమస్యలు సృష్టిస్తున్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని లోతుగా అధ్యయనం చేయాలి. అడవి పందులను చంపక తప్పని పరిస్థితి ఉంటే.. పంచనామా నిర్వహించి అందరి సంతకాలు సేకరించాలి.
-చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ ఉత్తర్వుల ప్రకారం కాల్చివేతకు సర్పంచులు ఆదేశాలు జారీ చేయవచ్చు. అడవి పందులను కాల్చే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
-కేవలం పంట పొలాలలోనే అడవి పందులను కాల్చడానికి షూటర్లకు అనుమతినివ్వాలి. రక్షిత ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలలో సంచరించే పందులను కాల్చి చంపడానికి వీలులేదు. ఈ సందర్భంగా మనుషులకు గానీ ఇతర జంతువులకు గానీ ఎలాంటి అపాయం జరుగకుండా చూడాలి.
-అడవి పందులను కాల్చే సమయంలో ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినా.. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నా.. దానికి పూర్తి బాధ్యత షూటర్లపైనే ఉంటుంది. దీనికి అటవీశాఖ ఎలాంటి బాధ్యత వహించదు.
-అడవి పందులను కాల్చడానికి అనుమతినిస్తూ గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రతిని స్థానిక అటవీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లేదా బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్లకు సమర్పించాలి.
-చంపిన అడవి పందుల కళేబరాలను పూడ్చే సమయంలో గ్రామ పంచాయతీ పంచనామా చేయాలి, స్థానిక అటవీ అధికారుల సమక్షంలో భూమి లోపల పాతిపెట్టాలి. మృత కళేబరాలను ఎక్కడా వాడటానికి వీలు లేదు. మాంసం, లేదా ఇతర శరీర భాగాలను వాడితే చట్టపరంగా కేసు నమోదు చేస్తారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎన్ని పందులను చంపాల్సి వచ్చింది అనే నివేదికను స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంబంధిత అటవీ డీఎఫ్వో, లేదా ఎఫ్డీవోకు సమర్పించాలి. అక్కడి నుంచి ఆ నివేదిక చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్కు చేరుతుంది. గ్రామ సర్పంచులకు ఇచ్చిన విచక్షణాధికారం కేవలం ఒక ఏడాది వరకు ఉంటుంది. ఆ తర్వాత తిరిగి రెన్యువల్ చేసుకోవాలి.
You may like
-
బడ్జెట్ రూపకల్పనపై టీ.సర్కార్ కసరత్తు..శాఖల వారీగా లెక్కలు స్వీకరిస్తున్న అధికారులు
-
మహబూబ్ నగర్ జిల్లాలో అమానుషం : ఎనిమిదేళ్ల బాలుడిని ఉరేసి చంపిన దుండగులు
-
కాకినాడ సెజ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం..సెజ్ కోసం సేకరించిన 2,180 ఎకరాలు వెనక్కి
-
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి
-
కర్నాటకలోని క్వారీలో పేలుడు.. ఆరుగురు మృతి
-
చీరతో భర్తను హత్య చేసిన భార్య, కారణం తెలిస్తే మంచి పని చేసిందంటారేమో

ఒకే కంపెనీలో రూ. 220కోట్ల నల్లధనం.. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకే లెక్క చూపించలేదా?

బేబీ డ్యాన్స్ ఫ్లోర్ రెడీ అంటున్న ‘రాబర్ట్’..

‘స్వర్ణం’ సాధించిన వినేశ్ ఫొగాట్

ఆశి, బేబమ్మ, బుచ్చిబాబులకు అదిరిపోయే గిఫ్ట్స్ ఇచ్చిన మైత్రీ నిర్మాతలు..

కేంద్ర మంత్రికి కేటీఆర్ లేఖ

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

ఐశ్వర్యా రాజ్ భకుని ఫొటోస్

నేచురల్ బ్యూటీ సుభిక్ష ఫొటోస్

సుకుమార్ ఫ్యామిలీ ఫంక్షన్లో స్టార్స్ సందడి!

బోధన్ అడ్రస్తో బంగ్లాదేశీయుల పాస్పోర్టులు

ఒక్కో ఫోన్ నెంబర్పై నాలుగు వాక్సినేషన్ రిజిస్ట్రేషన్లు

కారు టైరును స్వయంగా మార్చిన కలెక్టర్

అంతరిక్షయానంలో సరికొత్త ఇస్రో హిస్టరీ
