ఏపీ లో DSC పోస్టులకు వయోపరిమితి పెంపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక ఉపాధ్యాయ DSC పోస్టులకు వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఉద్యోగులకు గతంలో గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లుగా ఉంది. అయితే వయోపరిమితిని 54 ఏళ్లకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అభ్యర్థులందరికీ వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే జులై 1 నాటికి అభ్యర్థులు 54 ఏళ్లలోపు ఉండాలి.
వయోపరిమితి పెంపు నేపథ్యంలో దరఖాస్తు గడువును మే 16 వరకు పొడిగించారు. దరఖాస్తు గడువు పొడిగింపుతో మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 15న నిర్వహించాల్సిన పరీక్ష కూడా నెలాఖారకు వరకు వాయిదాపడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.