EAMCET Exam : నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్స్..గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదు
వర్షాలు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు అదుపులో ఉండటంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఎంసెట్ పరీక్షలకు ఒక లక్షా 72 వేల 241 మంది విద్యార్థులు హాజరవుతుండడంతో 108 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
EAMCET Exams : ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఇవాళ, రేపు, ఎల్లుండి పరీక్షలు నిర్వహిస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ వెల్లడించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు అదుపులో ఉండటంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ఎంసెట్ పరీక్షలకు ఒక లక్షా 72 వేల 241 మంది విద్యార్థులు హాజరవుతుండడంతో 108 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ప్రింట్ తీసిన ఆన్లైన్ దరఖాస్తుపై గెజిటెడ్ ధ్రువీకరణ అక్కర్లేదని కన్వీనర్ ప్రొఫెసర్ ఏ.గోవర్ధన్ పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తుపై విద్యార్థి ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించాల్సి ఉండగా, తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు. విద్యార్థులు రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
Postal Jobs : పదోతరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు
కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులు మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఏదైనా గుర్తింపు కార్డు, హాల్టికెట్తోపాటు చిన్నసైజు వాటర్బాటిల్, శానిటైజర్ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. సెషన్కు 29 వేల మంది చొప్పున మొత్తం ఆరు సెషన్స్లో 1.72 లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్టు వెల్లడించారు. విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకుంటామని, మెహిందీ లాంటివి చేతికి పెట్టుకోవద్దని సూచించారు.