ఇంటర్ విద్యార్థులకు శుభవార్త: రీ వెరిఫికేషన్, రీ వాల్యూషన్ గడువు పొడిగింపు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్మీడియట్ బోర్డు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తు గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగా సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును కూడా ఏప్రిల్ 27 వరకు పెంచుతున్నట్లు బోర్డు కార్యాలయం ప్రకటించింది.
మార్కులు తక్కువ వచ్చాయని, ఫలితాలు సరిగాలేవని ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వెబ్సైట్ల ద్వారా రీ వాల్యూషన్, రీ వెరీఫెకేషన్ దరఖాస్తు చేసుకోవాలని ఒకేసారి వెబ్సైట్ మీదపడ్డారు. దాంతో సాంకేతిక కారణాల రీత్యా సైట్ ఆగిపోయింది. సమయానికి సైట్ అందుబాటులో లేదని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు.
ఈ క్రమంలో ఏప్రిల్ 27వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గడువును పెంచుతున్నట్లు బోర్డు తెలిపింది.