Telugu University : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కొత్త కోర్సులు
హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.
new courses in Telugu University : హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నూతన కోర్సులు ప్రవేశపెట్టారు. ఈ ఏడాది పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఇందులో ఎంఎఫ్ఏ (మాస్టర్స్ ఇన్ శిల్పం, చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్), ఎంఏ (చరిత్ర, టూరిజం) కోర్సులు ఉన్నాయి.
Medical College : తెలంగాణలో మరో కొత్త మెడికల్ కాలేజీ
ఎంఫిల్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ కోర్సులకు సంబంధించి విద్యార్థులు అక్టోబర్ 11, 2021 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. వివరాలకు www.teluguuniversity.ac.in, www.pstucet.org వెబ్సైట్లను చూడాలని సూచించారు.