సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో 15 నుంచి ఒంటి పూట బడులు

  • Published By: chvmurthy ,Published On : March 3, 2019 / 04:47 AM IST
సమ్మర్ ఎఫెక్ట్ : ఏపీలో 15 నుంచి ఒంటి పూట బడులు

అమరావతి: ఏపీ లోమార్చి 15 నుంచి  ఒంటిపూట బడులు నిర్వహిస్తారు.  అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒక పూట మాత్రమే పనిచేస్తాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల విద్యా క్యాలెండర్‌లో దీనిని పొందుపరిచారు. అయితే మార్చి మొదటి నుంచే ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఒంటిపూట బడులను మరింత ముందుకు జరిపే అవకాశం ఉంది.