మే 16 నుండి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

  • Published By: madhu ,Published On : April 19, 2019 / 03:43 PM IST
మే 16 నుండి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు

తెలంగాణలో ఇంటర్ మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం ఇంటర్ అధికారులు రిలీజ్ చేశారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఒక ప్రకటనలో వెలువరించారు. మే 16వ తేదీ నుండి మే 27 వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇంటర్ మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.

ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 18వ తేదీ గురువారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,70,575 మంది విద్యార్థులు పాస్ అయితే..మొత్తం 59.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 2,71,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా 65 శాతం ఉత్తీర్ణత నమోదైంది.