Grading for SSC : ఈ ఏడాది కూడా టెన్త్ విద్యార్ధులకు గ్రేడ్స్.. ఎలా ఇస్తారంటే?

Grading for SSC : ఈ ఏడాది కూడా టెన్త్ విద్యార్ధులకు గ్రేడ్స్.. ఎలా ఇస్తారంటే?

ssc Students Grades

SSC grades : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వడంపై ఎస్ఎస్‌సీ బోర్డు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కూడా ఎస్ఎస్‌సీ

పరీక్షలను రద్దుచేసి ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) ఆధారం గా విద్యార్ధులకు గ్రేడింగ్‌ ఇచ్చారు. ఈ ఏడాదీ అలానే ఇవ్వనున్నారు. దీనిపై ఒక వారంలో నిర్ణయం వెలువడనుందని తెలుస్తోంది.

మార్కులు ఎలా లెక్కిస్తారు ?
ఏటా ఎస్ఎస్‌సీ

విద్యార్థులకు 4 ఎఫ్‌ఏలు నిర్వహించేవారు. 40 రోజులకు మించకుండా బోధించిన పాఠ్యాంశాలకు ఈ పరీక్షలు జరిపేవారు. 4 ఎఫ్‌ఏలకు సంబంధించిన 80 మార్కులను 20 మార్కులకు కుదించి తుది ఫలితాల్లో కలిపేవారు. ఈ ఏడాది రెండు ఎఫ్‌ఏలు జరపాలని నిర్ణయం తీసుకున్నా ఒకే ఎఫ్‌ఏ సాధ్యమైంది. ఆ పరీక్ష మార్కుల అప్‌లోడింగ్‌ ప్రక్రియ జరుగుతున్నది. గతేడాది 20 ఎఫ్‌ఏ మార్కులను 100గా పరిగణించి, విద్యార్థి సాధించిన ఎఫ్‌ఏ మార్కులు కలిపి గ్రేడ్లుగా ఇచ్చారు.

ఉదాహరణకు ఒక విద్యార్థికి తెలుగులో 20 మార్కులకు 16 మార్కులు వచ్చినట్టయితే 16×5=80 మార్కులు వచ్చినట్లుగా లెక్కించి A2 గ్రేడ్‌ను కేటాయించారు. ఇదే తరహాలో అన్ని సబ్జెక్టుకు ఎఫ్‌ఏ మార్కులతో లెక్కించి గ్రేడ్లు కేటాయించారు.

ఎఫ్‌ఏలో 7 మార్కు లు వచ్చినా విద్యార్థి పాస్‌ అయినట్టేనని అధికారులు చెప్తున్నారు. హిందీలో 4 మార్కులు వచ్చినా సరిపోతుందని అంటున్నారు. ప్రధాన పరీక్షల్లో హిందీలో 20, ఇతర సబ్జెక్టుల్లో 35 మార్కులు వస్తే పాస్‌ అయినట్టుగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే.

ఉపాధ్యాయులు ఇంటర్నల్‌ మార్కుల్లో ఫెయిల్‌ చేయరని, ఈ లెక్కన విద్యార్థులంతా పాస్‌ అయినట్టేనని చెప్తున్నారు. ఈ విషయంలో టీచర్లు, విద్యావేత్తల అభిప్రాయాలు కూడా తీసుకుంటామన్నారు. సీబీఎస్‌ఈ కొత్త ఫార్ములా కోసం కూడా వేచి చూస్తున్నట్టు తెలిపారు.