Bandi sanjay gives clarity: ఎంపీ కోమటిరెడ్డి టచ్లో ఉన్నారని నేను అనలేదు: బండి సంజయ్
ఎంపీ కోమటిరెడ్డి తమతో టచ్లో ఉన్నారని తాను అనలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వీడిన నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ... ఎవరు వెళ్ళినా ప్రధాని మోదీ కలుస్తారని, అలాగే, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిశారని చెప్పారు. అభివృద్ధి నిధులపై ప్రధానిని వెంకట్రెడ్డి కలుస్తూ ఉంటారని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిదే బీజేపీనే అని ఆయన చెప్పారు.
Bandi sanjay gives clarity: ఎంపీ కోమటిరెడ్డి తమతో టచ్లో ఉన్నారని తాను అనలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వీడిన నేపథ్యంలో బండి సంజయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ఎవరు వెళ్ళినా ప్రధాని మోదీ కలుస్తారని, అలాగే, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిశారని చెప్పారు. అభివృద్ధి నిధులపై ప్రధానిని వెంకట్రెడ్డి కలుస్తూ ఉంటారని ఆయన అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిదే బీజేపీనే అని ఆయన చెప్పారు.
ఉప ఎన్నికల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలలు టైమ్పాస్ చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. గత ఉప ఎన్నికల సమయాల్లో ఇదే జరిగిందని అన్నారు. ఉప ఎన్నికలు రావాలని కోరుకున్నది కేసీఆరేనని ఆయన చెప్పారు. కాగా, మునుగోడులో నేడు కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి హాజరుకాబోనని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించడంతో ఆయన కూడా బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేసే వారికి నోటీసులు పంపుతానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనతో సంప్రదింపులు జరపడం లేదని బండి సంజయ్ చెప్పారు. మునుగోడులో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో గెలిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాణించవచ్చని అనుకుంటున్నాయి.
China Taiwan Tension: తైవాన్కు వెళ్ళకుండా మమ్మల్ని అడ్డుకోలేరు: నాన్సీ ఫెలోసీ