Chinna jeeyar swamy : తిరుమలలో అతిథి గృహాన్ని ప్రారంభించిన చిన్నజీయర్ స్వామి

తిరుమలలో మైహోమ్ గ్రూప్ నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. మై హోమ్ గ్రూప్ నిర్మించిన అతిథి గృహానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు చిన్న జీయర్ స్వామి. శ్రీరామనవమి పూర్వసంధ్యలో ఈ కార్యక్రమం జరగడం సంతోషకరం అన్నారు. భక్తులకు సేవలందించాలనే ఉద్దేశంతో మై హోం గ్రూప్ ఈ అతిథి గృహాన్ని నిర్మించి శ్రీవారికి సమర్పిస్తోందన్నారు. మై హోమ్ గ్రూప్ కు స్వామివారి అనుగ్రహం ఉండాలన్నారు చిన్న జీయర్ స్వామి.