Home » రిపబ్లిక్ డే రోజు లక్ష ట్రాక్టర్లతో రైతుల పరేడ్
Published
1 month agoon
Farmers’ union leaders decided to a rally with one lakh tractors on Republic Day : కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆపబోమని రైతు సంఘాల నేతలు మరోసారి తేల్చి చెప్పారు. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. రిపబ్లిక్ డే పరేడ్ ముగిసిన వెంటనే ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్పై లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ జెండాతో ట్రాక్టర్ పరేడ్ నిర్వహిస్తామని చెప్పారు.
దీంతో అధికారికంగా నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్కు ఎలాంటి అంతరాయం ఉండదని రైతు సంఘాల నేతలు అంటున్నారు. దాదాపు లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని భావిస్తున్నారు. పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో రైతులు బయల్దేరారు. ఇదిలా ఉంటే రైతుల ట్రాక్టర్ ర్యాలీపై రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది.
కేంద్ర ప్రభుత్వానికి రైతుల హెచ్చరిక
ఢిల్లీ వెళ్లే వారికి ముఖ్య గమనిక, ప్రభుత్వం కొత్త నిబంధన
చీరతో భర్తను హత్య చేసిన భార్య, కారణం తెలిస్తే మంచి పని చేసిందంటారేమో
జేబులకు చిల్లు : లీటర్ పెట్రోల్ రూ. 100
ఆమె చేతిపై పచ్చబొట్టు..అత్యాచారం నిందితుడికి బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు : ‘టాటూ వేయటం అంత ఈజీ కాదు‘అన్న ధర్మాసనం
ప్రత్యేకహోదాను ప్రధాని మోడీ పట్టించుకోవాలి : పిల్లి సుభాష్చంద్రబోస్