కరోనా వస్తుంది ఇలా : ముందు జ్వరం..పొడిదగ్గు.. తర్వాత

  • Published By: madhu ,Published On : March 14, 2020 / 03:31 PM IST
కరోనా వస్తుంది ఇలా : ముందు జ్వరం..పొడిదగ్గు.. తర్వాత

జలుబు చేసినా, దగ్గొచ్చినా గుండె దడ పెరిగిపోతోంది. ఛాతి, తలలో నొప్పి వస్తే.. గుండె ఆగినంత పనైపోతుంది. కరోనా వ్యాప్తితో ప్రతి ఒక్కరిలోనూ ఇదే టెన్షన్‌. వైరస్‌ ఎఫెక్ట్‌తో ఇండియాలో ఆందోళనకరమైన సిట్యువేషన్ కనిపిస్తోంది. కరోనా వైరస్ సోకి ఇద్దరు మృతి చెందడం..బాధితుల సంఖ్య అధికమౌతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వైరస్‌కు ముకుతాడు వేసే దారిలేక.. జాగ్రత్త చర్యలతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. 

* కరోనా లక్షణాల్లో మొదటిది జ్వరం.. ఆ తర్వాత పొడిదగ్గు, ముక్కు కారడం. వారం రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలవుతాయి. పది రోజుల తర్వాత ఫీవర్ టెంపరేచర్ పెరిగిపోతుంది. ఈలోగా ఊపిరిసలపని జలుబు, దగ్గు ఎక్కువైపోతుంది. అదే టైమ్‌లో తలనొప్పి, ఛాతి నొప్పి తీవ్రంగా వేధిస్తుంది. చూస్తుండగానే న్యూమోనియాకు దారితీస్తుంది.

 

* ఉపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. అది గుర్తించేలోపే మిగతా అవయవాలకు వైరస్‌ పాకుతుంది. కిడ్నీలు ఫేయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఊపిరాడని పరిస్థితి నెలకొంటుంది. అసలు దగ్గడానికి, తుమ్మడానికి శక్తి లేకుండా పోతుంది. అప్పటికే వ్యాధి లక్షణాలు చికిత్సకు లొంగకుండా తయారవుతాయి. దీంతో ఉన్నట్టుండి ఊపిరి ఆగిపోతుంది. 

* చైనాలో వైరస్‌ బారినపడ్డ బాధితుల్ని ఎక్స్‌రే తీయగా ఉపిరితిత్తుల్లో నీరు చేరినట్టుగా క్లియర్‌గా తెలుస్తోంది. వైరస్‌ ఎఫెక్ట్‌ ఒక్క లంగ్స్‌కే కాదు రోజుల వ్యవధిలోనే కిడ్నీలతో పాటు ఇతర భాగాలకు చేరుతుంది. అవి పని చేయకుండా నిర్వీర్యం అయిపోతాయి. కీలక అవయవాలు పనిచేయకుండా పోవడంతో ఏ క్షణమైనా ప్రాణాలు పోయే అవకాశాలుంటాయి.

* ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులే ఉన్నారు. అలాగే పార్కిన్సన్‌, డయాబెటిస్‌ లాంటి పేషెంట్లు కూడా కరోనా బారినపడుతున్నారు. 

Read More : ఏపీలో పోలీసు టెర్రరిజం : కంట్రోల్ యువర్ సెల్ఫ్..ఆయన డీజీపీయేనా – బాబు