కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్, మానసిక రుగ్మతల ముప్పు ఎక్కువ!

కరోనాతో బ్రెయిన్ స్ట్రోక్, మానసిక రుగ్మతల ముప్పు ఎక్కువ!

Covid linked to risk of mental illness and brain disorder : కరోన సోకిన ఎనిమిది మందిలో ఒకరు వైరస్ సోకిన ఆరు నెలల్లోనే అనేక అనారోగ్య సమస్యలకు గురవవుతున్నారని కొత్త అధ్యయనం వెల్లడించింది. వారిలో ఎక్కువగా మొదటి మానసిక లేదా నాడీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. అందులో కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో చాలావరకు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. దీనికారణంగా మెదడులో అనేక మానసిక రుగ్మతలకు దారితీస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. మానసిక లేదా నాడీ సంబంధిత అనారోగ్యం ఉన్న రోగుల్లో ఆ గణాంకాలు మూడింటిలో ఒకదానికి పెరిగాయని కనుగొన్నారు.

కోవిడ్-19 సోకిన తొమ్మిది మందిలో ఒకరు ఆస్పత్రిలో చేరకపోయినా.. డిప్రెషన్ లేదా స్ట్రోక్ వంటి సమస్యలతో బాధపడుతున్నారని తేలింది. కరోనా నుంచి కోలుకున్నవారితో పాటు పాజిటివ్‌తో ఆస్పత్రిలో చేరిన 236,379 మంది అమెరికాకుచెందిన బాధితులపై పరిశోధకులు ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులను ఉపయోగించారు. వీరి డేటానుఇన్ఫ్లుఎంజా బాధిత గ్రూపుతో పోల్చి చూశారు. వయస్సు, లింగం, జాతి, అంతర్లీన శారీరక, మానసిక పరిస్థితులు, సామాజిక-ఆర్ధిక లేమి వంటి ప్రమాద కారకాలకు కారణమై ఉంటుందని తేల్చారు. కరోనా నుంచి కోలుకున్నాక ఆరు నెలల్లో నాడీ లేదా మానసిక సమస్యలు 33.6శాతంగా ఉన్నట్టు కనుగొన్నారు.

దాదాపు 13శాతం మందిలో మొదటగా ఈ రుగ్మతలను గుర్తించారు. కరోనా సోకిన ఐదుగురిలో ఒకరు మూడు నెలల్లోనే మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని పరిశోధకులు గుర్తించారు.బ్రెయిన్ స్ట్రోక్, మెదడు లోపల తీవ్రమైన రక్తస్రావం, మతిమరుపు, మానసిక రుగ్మతలతో సహా ఇన్ఫ్లుఎంజా లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కంటే.. కోవిడ్ -19 నుంచి కోలుకున్నాక చాలామంది బాధితుల్లో ఈ అనారోగ్య సమస్యలు చాలా సర్వసాధారణమని పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఆస్పత్రిలో చేరిన బాధితుల్లోనే ఎక్కువగా ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయని తేలింది.