అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు, ఎలా అంతమైపోతుందంటే?

అసలు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు, ఎలా అంతమైపోతుందంటే?

Covid-19 pandemic end : 2020 ఏడాదంతా కరోనా మహమ్మారితోనే గడిచిపోయింది. 2021లోనైనా మహమ్మారి అంతమైపోతుందా? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎన్ని కరోనా వ్యాక్సిన్లు వచ్చినా మహమ్మారి పూర్తిగా అంతంకాలేదు. ఇంకా కరోనా విజృంభిస్తూనే ఉంది. ఎప్పటికీ కరోనా అంతమవుతుందో కూడా అంతుపట్టడం లేదు. సాధారణ పరిస్థితులు ఎప్పుడూ వస్తాయా? అని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. కరోనా రోజురోజుకీ మ్యుటేషన్ చెందుతూ కొత్తకొత్త వేరియంట్లు పుట్టకొస్తున్నాయి. మహమ్మారిని నిర్మూలించే కరోనా వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా తయారవుతునే ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు మ్యుటేషన్ వేరియంట్లపై ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయనేది కూడా ప్రశ్నర్థాకంగానే ఉంది. అయినప్పటికీ డ్రగ్ మేకర్లు తమ వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తాయని అంటున్నాయి.

కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. అమెరికాలో విజృంభించిన కరోనా తగ్గుముఖం పట్టి 2021 రెండవ త్రైమాసికం నాటికి సాధారణ స్థితికి చేరుకుంటుందని అంచనా. డిసెంబర్ 2021 నాటికి అందరి జీవితాలు సాధారణ స్థితికి రావచ్చు. కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. 2022లోనూ కరోనా పరిస్థితులు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీతోనే కరోనా మహమ్మారిని అంతం చేయడం సాధ్యపడుతుందని భావిస్తున్నారు. అది ఇప్పట్లో జరిగేలా లేదు.

70-80 శాతం హెర్డ్ ఇమ్యూనిటీ అవసరం :
ప్రపంచ జనాభాలో 70శాతం నుంచి 80శాతం కరోనావైరస్ నుంచి ఇమ్యూనిటీ సాధించాలి. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే తగినంత స్థాయిలో అందరికి టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నాటికి సుమారు 44.1 మిలియన్ల మందికి COVID-19 వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదు అందినట్టు ఓ నివేదిక పేర్కొంది. 19.4 మిలియన్లకు రెండు మోతాదులతో పూర్తిగా టీకాలు వేయించారు. సగటున రోజుకు 1.6 మిలియన్ మోతాదులను అందిస్తున్నారు. జనవరిలో రోజుకు 1 మిలియన్ మోతాదులు అందించారు.

హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం అంటే సుమారు 300 మిలియన్ల మందికి టీకాలు వేయాలి.. 600 మిలియన్ మోతాదుల వరకు అవసరం పడుతుంది. ఇప్పటికే 45 మిలియన్ మోతాదులు మాత్రమే అందించారు. ప్రస్తుత రేటు ప్రకారం, జాతీయ స్థాయిలో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడానికి అమెరికాలో ఒక ఏడాది పట్టొచ్చు. వృద్ధులు, పిల్లలు సహా అందరికి టీకాలు అందుబాటులోకి రావాల్సి ఉంది. దేశ జనాభాలో 80శాతం నుంచి 90శాతం మంది క్రిస్మస్ సమయానికి టీకాలు అందించాల్సి ఉంది. అప్పటికీ హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తే.. కరోనా మహమ్మారిని అంతమైపోనట్టే..