చైనా సోషల్ మీడియాలో యోగి వీడియో ట్రెండ్.. యోగాతోనే కరోనా క్యూర్ అవుతుంది!

  • Published By: sreehari ,Published On : March 9, 2020 / 02:01 AM IST
చైనా సోషల్ మీడియాలో యోగి వీడియో ట్రెండ్.. యోగాతోనే కరోనా క్యూర్ అవుతుంది!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3వేల మంది మృతిచెందగా, 90లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ కు ఎలాంటి మందు లేదు. కేవలం నివారణ మార్గాలు మాత్రమే పాటించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ నుంచి తొందరగా క్యూర్ కావాలంటే యోగా చేయడం తప్పనిసిరి అంటూ యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ ప్రసంగం ఒకటి చైనా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చైనాలో పుట్టిన కరోనాను తరిమికొట్టగల సామర్థ్యం ఒక యోగాకే ఉందని ఆయన చెప్పిన యోగీ వీడియో ట్రెండ్ అవుతోంది.

ఉత్తరాఖండ్ లోని రిషికేష్ లో జరిగిన యోగా మహోత్సవ్ కార్యక్రమంలో యోగీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన యోగా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో వివరించారు. క్రమం తప్పకుండా యోగా చేస్తుంటే.. అది ప్రాణాంతకమైన కరోనా వైరస్‌పై పోరాడుతుందని అన్నారు. ఒక్క కరోనా వైరస్ మాత్రమే కాదు.. ఎలాంటి వ్యాధులనైనా తట్టుకోగల సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. దీనికి శాస్త్రీయ ఆధారం లేదన్నారు. భారత సంప్రదాయాన్ని లోతుగా అర్థం చేసుకుంటే యోగా ద్వారా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోవచ్చునని అన్నారు.

ప్రపంచమంతా భౌతికంగా, మానసిక అనారోగ్యానికి వ్యతిరేకంగా పోరాడుతోందని చెప్పారు. యోగా ద్వారా బ్లడ్ ప్రెజర్, హార్ట్ ఎటాక్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ సహా కరోనా వైరస్ వంటి వ్యాధులను కూడా నయం చేయగలదని యోగి ఆధిత్యనాథ్ తన ప్రసంగంలో వివరించారు. ప్రత్యేకించి చైనా సోషల్ మీడియా వైబో ప్లాట్ ఫాంపై అధిత్యానాథ్ స్పీచ్.. భారీగా ట్రెండ్ అవుతోంది. దీనిపై బహిరం చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే యోగీ యోగా వీడియోకు మిలియన్ల వ్యూస్, 6వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.

See Also | మరణమృదంగం : క్యా కరోనా..3 వేల 98 మంది మృతి