ఉద్యోగులను తొలగించవద్దు : పారిశ్రామికవర్గాలకు కేటీఆర్ విజ్ఞప్తి

ఉద్యోగులను తొలగించవద్దు : పారిశ్రామికవర్గాలకు కేటీఆర్ విజ్ఞప్తి

పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. లాక్‌డౌన్‌ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుకోవాలని కంపెనీలకు సూచించారు. లాక్‌డౌన్‌ తరువాత త్వరలోనే పరిశ్రమలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రతకు యాజమాన్యాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.