గో-కార్టింగ్ సరదా: ప్రాణాపాయ స్థితిలో B.Tech యువతి

  • Published By: vamsi ,Published On : October 8, 2020 / 05:30 PM IST
గో-కార్టింగ్ సరదా: ప్రాణాపాయ స్థితిలో B.Tech యువతి

Go-Karting Accident: హైదరాబాద్ శివార్లలో గుర్రంగూడ గో-కార్టింగ్ ప్లే జోన్‌లో.. ఓ 20 ఏళ్ల యువతి గో-కార్టింగ్(go-karting) సరదా ఆమె ప్రాణాపాయ స్థితిలో పడేలా చేసింది. మీర్‌పేట పోలీసు పరిధిలో గుర్రామ్‌గుడలో ఉన్న హస్టెన్ గో-కార్టింగ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. గాయపడిన మహిళను నగరంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బిటెక్ విద్యార్థి శ్రీవర్షిణిగా పోలీసులు గుర్తించారు.

ఇన్‌‌స్పెక్టర్ ఎం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. “శ్రీవర్షిణి తన స్నేహితులతో కలిసి హస్టన్ గో-కార్టింగ్‌కు వెళ్ళారు. గో-కార్ట్ నడుపుతుండగా వాహనం బోల్తా పడింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి మార్చారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందడంతో.. అక్కడకు వెళ్లగా.. ఆమె ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉంది” అని చెప్పారు.



B.Tech ఫైనల్ ఇయర్ చదువుతోన్న శ్రీ వర్షిణి తన ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా ఎంజాయ్ చేసేందుకు అక్కడకి వెళ్లగా.. ప్లే జోన్‌లో ఉన్న కారులో కాసేపు రౌండ్స్ వేద్దాం అనుకుంది. ఓ యువకుడు కార్ డ్రైవింగ్ చేస్తుండగా శ్రీ వర్షిణి పక్కనే కూర్చుంది. అయితే కారు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. టైర్‌కు శ్రీ వర్షిణి తల వెంట్రుకలు చుట్టుకోవడంతో తల బలంగా నేలకు తగిలిందని, ఆమె పెట్టుకున్నహెల్మెట్‌ కూడా పగిలిపోయి తలకు తీవ్రంగా గాయమైందని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఈ యాక్సిడెంట్‌లో శ్రీ వర్షిణికి తీవ్ర గాయాలయ్యాయి.



అర్ధరాత్రి సమయంలో గో కటింగ్ కు అనుమతి ఇవ్వడం పైన అటు తల్లిదండ్రులు శ్రీ వర్షిణి తల్లిదండ్రులు మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గో కార్టింగ్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీ వర్షిణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.