అమీర్ పేట-హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం

హైదరాబాద్ : హైటెక్ సిటీకి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న అమీర్ పేట-హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం అయింది. మార్చి 20 బుధవారం గవర్నర్ నరసింహన్ జెండా ఊపీ మెట్రో రైలును ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణికులను అనుమతిస్తారు. రివర్సల్ లేని కారణంగా మూడు స్టేషన్లలో మెట్రో రైలు ఆగదు. జూబ్లీ చెక్ పోస్టు, పెద్దమ్మ గుడి, మాదాపూర్ స్టేషన్లలో ఆగదు. తొలిదశలో మొత్తం 72 కి.మీలలో 46 కిలోమీటర్ల వరకు సేవలు అందించిన మెట్రోరైలు.. మరో 10 కిలోమీటర్లు సేవలు అందించనుంది. దీంతో మూడో కారిడార్ పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టైంది.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ ఎంప్లాయిస్ హైటెక్ మాదాపూర్ ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రధానంగా ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట్ నుండి వచ్చేవారు, లక్డికాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి వెళ్లేవారు పెద్ద సంఖ్యలో ఉంటారు. మెట్రో రైలు ప్రారంభమవ్వడంతో వారి కష్టాలకు బ్రేక్ పడింది. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు పది కిలోమీటర్లలో మొత్తం తొమ్మిది స్టేషన్లున్నాయి. ప్రస్తుతం మెట్రో ట్రైన్స్ రన్ అవుతున్న స్టేషన్లో ప్రతి ఆరు నిమిషాలకు ఒక ట్రైన్ మూవ్ అవుతుంది. అయితే అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి 9 నుండి 12 నిమిషాలకు ఒక ట్రైన్ నడపనున్నారు.
అయితే కొత్తగా ప్రారంభమైన మెట్రోరైలు జూబ్లీహిల్స్, పెద్దమ్మ టెంపుల్, మాదాపూర్ స్టేషన్లలో ఆగదని అధికారులు తెలిపారు. హైటెక్ సిటీ వరకు వెళ్లిన ట్రైన్కు రివర్సల్ వ్యవస్థ లేక పోవడంతో మూడు స్టేషన్లలో ప్రస్తుతం మెట్రో రైలు ఆగదు. ఈ రూట్లో అత్యధికంగా మూల మలుపులు ఉండటంతో స్పీడు తగ్గించాల్సి వస్తుందని మెట్రో వర్గాలు చెప్పాయి. అయితే అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ట్రైన్ నిలుపకపోవడంతో ప్రయాణికులు ముందు స్టేషన్లో దిగాల్సిన పరిస్థితి.. ఈ రూట్లో రివర్సల్ వ్యవస్థ పూర్తయ్యే వరకు ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడకతప్పదని
- GST Officials : జీఎస్టీ అధికారులపై కేసు నమోదు
- Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే
- Omicron BA.4 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు నమోదు.. హైదరాబాద్ లో గుర్తింపు
- Jr.NTR Fans : జూ.ఎన్టీఆర్ ఇంటిముందు అర్ధరాత్రి ఫ్యాన్స్ హంగామా..లాఠీచార్జ్ చేసిన పోలీసులు
- CM Jagan : వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్
1Water To Drink: నీరు తాగడానికి సరైన సమయం ఎప్పుడంటే..
2Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
3Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
4Tension In Amalapuram : అమలాపురం లో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు
5Tension In Amalapuram : అట్టుడుకుతున్న అమలాపురం.. మంత్రి క్యాంప్ ఆఫీస్, బస్సుకు నిప్పు.. పోలీసులపై రాళ్ల దాడి
6Nikhil: ఫస్ట్టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?
7Rapido : యువతులను వేధించిన ర్యాపిడో బైక్ డ్రైవర్ అరెస్ట్
8Kidney Stones : కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?
9LG OLED TV: చుట్టగా చుట్టేసే టీవీని విడుదల చేసిన ఎల్జీ సంస్థ: ధర ఎంతో తెలుసా?
10Sheep jailed for 3 years: మహిళను చంపిన గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు..!
-
Godfather: సల్మాన్తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
-
Sapota : పోషకాలను అందించటంతోపాటు, ఒత్తిడిని పోగొట్టే సపోటా!
-
Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
-
Bihar CM Nitish: అప్పట్లో మా తరగతిలో ఒక్క అమ్మాయి కూడా లేదు: బీహార్ సీఎం నితీశ్ కుమార్ వ్యాఖ్యలు
-
Agent: ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకున్న ఏజెంట్
-
Minister Roja: జగన్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా దేశంలో ఎక్కడా కనిపించడు: మంత్రి రోజా
-
After Exercise : వ్యాయామం తరువాత నిస్సత్తువ తగ్గాలంటే!
-
Uyghurs in China: చైనాలో “ఉయ్ఘర్స్ నిర్బంధ శిబిరాలు”: జింజియాంగ్ ప్రాంతంలో యూఎన్ ప్రతినిధి పర్యటన