వాళ్లకు మాత్రమే మోడీ చౌకీదార్ : జగన్కు 21 ఎంపీ సీట్లు
దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.
దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.
దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ధనవంతులకు మాత్రమే మోడీ చౌకీదార్ అని, చౌకీదార్ పేరు పెట్టుకున్నంత మాత్రన కాపలాదారులు కాలేరని అన్నారు. వ్యాపారులు, బ్యాంకు ఎగవేతదారులకు మోడీ కాపలాదారు అని, మోడీ లాంటి నాయకులకు ఓటు వేయొద్దని మోడీ చెప్పిన అచ్చేదిన్ ఇంకెప్పుడు వస్తుందని ఓవైసీ నిలదీశారు.
Read Also : మద్యంపై ఆంక్షలు: 6 మించి అమ్మొద్దు..గీత దాటితే వాతే
ముస్లిం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపితే.. సుప్రీంకోర్టులో కేసు ఉందంటూ కేంద్రం ఎటూ తేల్చట్లేదని మండిపడ్డారు. ప్రధానిగా ఉండి కూడా మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. అబద్ధాల రారాజు అనే బిరుదును ప్రధాని నరేంద్ర మోడీకి ఇవ్వవచ్చునని ఓవైసీ అన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిపి 17 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నాయని ఓవైసీ జోస్యం చెప్పారు. అలాగే ఏపీలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని, అక్కడ వైసీపీ 21 ఎంపీ సీట్లు, 130 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని చెప్పారు.
Read Also : జగన్ హామీ : లోకేష్పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి