బాలాపూర్ లడ్డూ వేలం కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందా!
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతి గడించి..వినాయకులే అధినాయకుడైన బాలాపూర్ వినాయకుడి వేలం పాట మరోసారి రికార్డు నమోదు చేయనుందా ? అనేది కొద్ది గంటల్లో తేలనుంది. సెప్టెంబర్ 12వ తేదీ గురువారం బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర జరుగనుంది. అంతకంటే ముందు లడ్డూ వేలం నిర్వహించనున్నారు నిర్వాహకులు. ఈ లడ్డూ వేలానికి ప్రత్యేకత ఉంది. దీనిని దక్కించుకోవడానికి చాలా మందే పోటీ పడుతుంటారు. వందల నుంచి మొదలైన వేలం పాట..లక్షల ధరకు వెళ్లిపోయింది. 2018 సంవత్సరంలో బాలాపూర్ మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా రూ. 16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ. 15 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు.
ఈ లడ్డూ వేలం తొలిసారిగా 1994లో ప్రారంభమైంది. కొలను మోహన్ రెడ్డి రూ. 450కి వేలం పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూ బాగా ప్రాచుర్యం పొందింది. సంవత్సరానికి ధర పెరిగిపోతూ వచ్చింది. వేలంలో పాడుకున్న వారు ఈ లడ్డూను అపురూపంగా భావిస్తుంటారు. పొలాల్లో చల్లితే పంట బాగా పండుతుందనే నమ్మకం..మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. అందుకే ఈ లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. మొదట్లో కేవలం స్థానికులకు మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం కల్పించి నిర్వాహకులు..ఆ తర్వాతి నుంచి బయటివారిని కూడా అనుమతినిస్తున్నారు.
సంవత్సరం | దక్కించుకున్న వారి పేరు | ధర |
1994 | కొలను మోహన్ రెడ్డి | రూ. 450 |
1995 | కొలను మోహన్ రెడ్డి | రూ. 4, 500 |
1996 | కొలను కృష్ణారెడ్డి | రూ. 18, 000 |
1997 | కొలను కృష్ణారెడ్డి | రూ. 28, 000 |
1998 | కొలను మోహన్ రెడ్డి | రూ. 51, 000 |
1999 | కల్లెం ప్రతాప్ రెడ్డి | రూ. 65, 000 |
2000 | కల్లెం అంజిరెడ్డి | రూ. 66, 000 |
2001 | జి. రఘునందన్ చారి | రూ. 85, 000 |
2002 | కందాడ మాధవరెడ్డి | రూ. 1, 05, 000 |
2003 | చిగిరింత బాల్ రెడ్డి | రూ. 1, 55, 000 |
2004 | కొలను మోహన్ రెడ్డి | రూ. 2, 01, 000 |
2005 | ఇబ్రం శేఖర్ | రూ. 2, 08, 000 |
2006 | చిగిరింత తిరుపతి రెడ్డి | రూ. 3, 00, 000 |
2007 | జి.రఘునందన్ చారి | రూ. 4, 15, 000 |
2008 | కొలను మోహన్ రెడ్డి | రూ. 5, 07, 000 |
2009 | సరిత | రూ. 5, 10, 000 |
2010 | కొడాలి శ్రీధర్ బాబు | రూ. 5, 35, 000 |
2011 | కొలను బ్రదర్శ్ | రూ. 5, 45, 000 |
2012 | పన్నాల గోవర్ధన్ రెడ్డి | రూ. 7, 50, 000 |
2013 | తీగల కృష్ణారెడ్డి | రూ. 9, 26, 000 |
2014 | సింగిరెడ్డి జై హింద్ రెడ్డి | రూ. 9, 50, 000 |
2015 | కొలను మదన్ మోహన్ రెడ్డి | రూ. 10, 32, 000 |
2016 | స్కైలాబ్ రెడ్డి | రూ. 14, 65, 000 |
2017 | నాగం తిరుపతి రెడ్డి | రూ. 15, 60,000 |
2018 | శ్రీనివాస్ గుప్తా | రూ. 16, 60, 000 |
2019 | ? | ? |