K.Chandrashekar Rao: 4 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం.. సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడనున్నారు. హైదరాబాద్లోని సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలంగాణ సీఎంవో తెలిపింది. తెలంగాణకు సంబంధించిన అంశాలతో పాటు దేశ రాజకీయాలపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశంలో కేసీఆర్ ఏం చెబుతారన్న ఉత్కంఠ నెలకొంది.
K.Chandrashekar Rao: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడనున్నారు. హైదరాబాద్లోని సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలంగాణ సీఎంవో తెలిపింది. తెలంగాణకు సంబంధించిన అంశాలతో పాటు దేశ రాజకీయాలపై ఆయన మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశంలో కేసీఆర్ ఏం చెబుతారన్న ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారమూ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నేడు ఏం చెబుతారన్న ఆసక్తి నెలకొంది.
జయశంకర్ జయంతి వేళ కేసీఆర్ ఘన నివాళులు
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జయంతి సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ‘ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కాని, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహనీయులు… తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
Chief Minister Sri K. Chandrashekar Rao will hold Press Conference today at 4 PM in Pragathi Bhavan.
— Telangana CMO (@TelanganaCMO) August 6, 2022