భట్టీ సన్మాన సభ రసాభాస : కుర్చీలతో ఫైటింగ్

  • Published By: veegamteam ,Published On : February 2, 2019 / 08:48 AM IST
భట్టీ సన్మాన సభ రసాభాస : కుర్చీలతో ఫైటింగ్

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కుమ్ములాటలు మొదలయ్యాయి. సీఎల్పీ నేత భట్టీ విక్రమార్క  సన్మాన సభలో కాంగ్రెస్ కార్యకర్తలు భట్టీ సమక్షంలోనే ఇదంతా జరిగింది.కుర్చీలతో ఫైటింగ్ చేసుకున్నారు. గాంధీ భవన్ లో జరుగుతున్న భట్టీ సన్మాన సభలో ఈ ఘటన చోటుచేసుకుంది.   గత అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్ పేట నియోజక వర్గం నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నూతి శ్రీకాంత్ వర్గీయులు..వీహెచ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో శ్రీకాంత్, వీహెచ్ వర్గీయులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓబీల ఆధ్వర్యంలో భట్టీకి జరుగుతున్న సన్మాన సభలో శ్రీకాంత్వ వర్గీయులు వీహెచ్ డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. వీహెచ్ బీసీలకు అన్యాయం చేస్తుంటారనీ అటువంటి వ్యక్తి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారనీ..తమకు మాత్రం  సరైన ప్రాతినిథ్య ఇవ్వలేదనీ  గ్రేటర్ పరిధిలోని ఓబీసీ అధ్యక్షులుగా ఉన్న నూతి శ్రీకాంత్ ఆరోపించారు. ఈ క్రమంలో భట్టీ సర్ధి చెబుతున్నా వినని కార్యకర్తలు మరింత రెచ్చిపోవటంతో సన్మాన సభ అర్థాంతరంగా ముగిసింది. దీంతో భట్టీ తన ఛాంబర్ లోకి వెళ్లిపోయారు. ఇలా ఆయన సన్మాన సభ రసాభాసాగా మారిపోయింది.