మాట వినకుంటే కఠినంగా ఉంటాం : నేతలకు ఏ, బీ ఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్ 

టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 07:04 AM IST
మాట వినకుంటే కఠినంగా ఉంటాం : నేతలకు ఏ, బీ ఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్ 

టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని తెలిపారు.

టీఆర్ఎస్ నేతలకు సీఎం కేసీఆర్.. ఏ, బీ ఫారాలు అందజేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇంచార్జీలకు ఏ, బీ ఫారాలు అందజేశారు. రెబల్స్ ను బుజ్జగించాలని నేతలకు సూచించారు. మాట వినకుంటే కఠినంగా ఉంటామని చెప్పాలని తెలిపారు. గురువారం (జనవరి 9, 2020) టీఆర్ఎస్ భవన్ లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సమావేశంలోనే డమ్మీ ఫామ్స్ భర్తీ చేసి చూపించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల బరిలో మనకు పోటీ ఎవరూ లేరని తెలిపారు. పోటీ లేకున్నా ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం ఫలితాలు మనకే అని ధీమా వ్యక్తం చేశారు. 

బీ-ఫారాల జారీకి సంబంధించి విధి విధానాలను వివరించారు. ఎన్నికల్లో విజయానికి వ్యూహాలు వివరించారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు వేసే సందర్భంగా తీసుకునే జాగ్రత్తలు, ప్రచారం, గెలుపు కోసం అనుసరించాల్సిన ప్రణాళికలు నేతలకు వివరించారు. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జీలకు బాధ్యతలు అప్పగించారు. పోటీ తవ్రంగా ఉండటంతో రెబల్స్ బెడద లేకుండా చూడాలని సూచించారు. టిక్కెట్లు ఆశించిన వారితోపాటు నాయకులందరినీ అభ్యర్థులు సమన్వయం చేసుకోవాలని చెప్పనున్నారు. ఒక్కమున్సిపాలిటీ ఓడినా మంత్రి పదవి ఊడుతుందని నేతలకు ఇప్పటికే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

టీఆర్ఎస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. సీఎం ముందుగా వచ్చినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడంపై కేసీఆర్ సీరియస్ కావడంతో వారంతా సైలెంట్ అయిపోయారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. వీరితోపాటు పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. 

దీంతో సీఎం కేసీఆర్ కొద్ది సేపు ఆగి సమావేశాన్ని ప్రారంభించాల్సివచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేల రాకకోసం సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఎదురుచూడటం చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా రావడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయాన్ని ముందుగానే చెప్పినా ఎందుకు ఆలస్యంగా వచ్చారని సీఎం అడిగినట్లు తెలుస్తోంది. సమయపాలన కచ్చితంగా పాటించాలని సూచించినట్లు సమాచారం.