కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 04:07 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యారేజీలు, పంపు హౌస్ ల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వాటి దగ్గర ఇంజనీర్లు, సిబ్బందికి క్వార్టర్లు, వాచ్ టవర్లు నిర్మించాలని తెలిపారు. సబ్ స్టేషన్ దగ్గర విద్యుత్ అధికారుల నివాసం కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మేడిగడ్డ బ్యారేజీ దగ్గర పోలీస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని తెలిపారు. బ్యారేజీల దగ్గర రెండు చొప్పున హెలిప్యాడ్లు నిర్మించాలని చెప్పారు. కాల్వలు తెంపకుండా ప్రభుత్వమే తూములు ఏర్పాటు చేస్తోందన్నారు. చెరువులను నింపడంతోపాటు వర్షపు నీటితో తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రస్తుతమున్న హెచ్‌ఎఫ్‌ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్‌ఎఫ్‌ఎల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ కవిత, సీఎస్ ఎస్‌కే జోషి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.