ఎక్కడున్నా పట్టేస్తాం : IT గ్రిడ్స్ చైర్మన్ అశోక్ ఫై లుక్ అవుట్ నోటీస్

  • Published By: veegamteam ,Published On : March 6, 2019 / 05:32 AM IST
ఎక్కడున్నా పట్టేస్తాం : IT గ్రిడ్స్ చైర్మన్ అశోక్ ఫై లుక్ అవుట్ నోటీస్

హైదరాబాద్ : ఐటీ గ్రిడ్ చైర్మన్ అశోక్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు . దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. అశోక్ దేశం విడిచి పారిపోకుండా చూడాలని ఆదేశించారు. ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐటీ గ్రిడ్స్ కంపెనీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో చైర్మన్ అశోక్‌ను లొంగిపోవాలని పోలీసులు సూచించారు. ఆయన లొంగిపోలేదు. నోటీస్ గడువు కూడా కూడా ముగిసింది. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇతర రాష్ట్రాలు, దేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్ ఔట్ నోటీసులు ఇష్యూ చేశారు. దీంతో ఆయన ఎటూపోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏ క్షణం అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ ను అరెస్టు చేసేందుకు.. తెలంగాణ పోలీసులు రంగం సిద్ధం చేస్తున్న క్రమంలో మరికొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుతో పాటు SR నగర్‌, KPHB కేసుల దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదుచేసిన లోకేశ్వర్‌రెడ్డిని సైబరాబాద్ పోలీసులు మరోమారు విచారించినట్లు తెలిసింది.