కాపురంలో చిచ్చు పెడుతోందని అత్తపై దాడి చేసిన కోడలు

  • Published By: murthy ,Published On : October 9, 2020 / 01:14 PM IST
కాపురంలో చిచ్చు పెడుతోందని అత్తపై దాడి చేసిన కోడలు

Hyderabad Crime News : ఉద్యోగం కోసం సౌదీ వెళ్లిన భర్త అత్తమాటలు విని కుటుంబం గురించి పట్టించుకోవటంలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై దాడి చేసినఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

మల్లేపల్లిలోని ఫిరోజ్ గాంధీ నగర్ లో నివసించే ఉబిద్ ఖాన్ కొన్నేళ్ళ క్రితం ఉద్యోగం కోసం సౌదీ వెళ్లాడు. దీంతో అతని భార్యా పిల్లలుఫిరోజ్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా భర్త కుటుంబం గురించి పట్టించుకోవటం మానేశాడు. ఇంటికి ఫోన్ కూడా చెయ్యటం లేదు.



అత్త మాటలు వినే మొగుడు కుటుంబం గురించి పట్టించుకోవటంలేదని భావించిన కోడలు అత్తపై దాడి చేసింది. గురువారం, అక్టోబర్ 8న, అత్త ఇంటికి వచ్చిన కోడలు ఆమెతో గొడవ పడింది. ఇంట్లోనుంచి అత్తను బయటకు లాక్కోచ్చి నడిరోడ్డుపై కొట్టింది. ఈ దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా హుమాయూన్ నగర్ పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.