తెలంగాణకు ఢిల్లీ నిజాముద్దీన్ గండం, ఆ జిల్లాల్లో హైఅలర్ట్, కరోనా వ్యాపించే అవకాశం

నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్

  • Published By: veegamteam ,Published On : March 31, 2020 / 05:39 AM IST
తెలంగాణకు ఢిల్లీ నిజాముద్దీన్ గండం, ఆ జిల్లాల్లో హైఅలర్ట్, కరోనా వ్యాపించే అవకాశం

నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్

నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఢిల్లీ దడ పట్టుకుంది. దానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మసీదే. అక్కడ జరిగిన మతపరమైన ప్రార్థనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది పాల్గొన్నారు. వారిలో చాలామందికి కరోనా సోకింది. కొందరు చనిపోయారు కూడా. దీంతో ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను, ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

ప్రార్థనల్లో పాల్గొన్న 2వేల మంది తెలుగువారు:
తెలంగాణలో ఏకంగా ఆరుగురు కరోనాతో చనిపోవడం, ఆ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 13 నంచి 15 తేదీల మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ లో నిర్వహించిన ప్రార్థనల్లో దేశ, విదేశాలకు చెందిన వారు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్, ఇరాన్, ఉజ్ బెకిస్తాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇతర దేశాల నుంచి మత పెద్దలు వచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 2వేల మంది ఈ ప్రార్థనల్లో పాల్గొనగా.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

దేశంలో కరోనాకు కేంద్రంగా మారిన నిజాముద్దీన్:
ఢిల్లీలోని ‘నిజాముద్దీన్‌’ ప్రాంతంలో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగింది. ఆ ప్రాంతం మాత్రమే కాదు… అక్కడ జరిగిన మత సదస్సులో పాల్గొని వచ్చిన వారిలోనూ కలవరం రేపుతోంది. ఏపీ, తెలంగాణలో ‘కరోనా పాజిటివ్‌’గా తేలిన వారిలో చాలామంది ఢిల్లీలో జరిగిన సదరు మత సదస్సుకు హాజరైన వారే. ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రార్థనా మందిరంలో రెండున్నర రోజులపాటు ఒక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరయ్యారు. వీరిలో అత్యధికులు మార్చి 14-15వ తేదీల్లో తమ ప్రాంతాల నుంచి రైళ్ల వెళ్లారు. 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం వరకు జరిగిన సదస్సులో పాల్గొన్నారు. 15 నుంచి 20 మందితో కూడిన బృందాలుగా వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించారు. ఢిల్లీలో ఉన్నన్ని రోజులు కలిసే బస చేశారు. ఆ తర్వాత రైళ్లలో బృందాలుగా వచ్చారు. ఏపీకి చెందిన వారు దురంతో ఎక్స్‌ప్రెస్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్ లలో ప్రయాణించారు.

తెలంగాణలో 6 కరోనా మరణాలు, అంతా ఢిల్లీకి వెళ్లొచ్చిన వారే:
వీరిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. తెలంగాణలో ఇప్పటికే ఆరుగురు మరణించారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు, వారి ద్వారా ఇతరులకు కలిపి ఏడెనిమిది మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ స్వయంగా ప్రకటించారు. సోమవారం(మార్చి 30,2020) తెలంగాణలోనూ ‘ఢిల్లీ కనెక్షన్‌’ ఉన్న వారిలో ఐరుగురు మరణించారు. మరో ఆందోళనకరమైన విషయమేమిటంటే… ఢిల్లీ సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన వారిలో పలువురు ఆ వివరాలు తెలిపేందుకు స్థానికంగా మరిన్ని ప్రార్థనా మందిరాల్లో చిన్నపాటి సమావేశాలు నిర్వహించారట.

లోకల్‌ కాంటాక్టు ద్వారా 70 శాతం కేసులు:
తెలంగాణలో పెరుగుతోన్న కరోనా కేసుల్లో సగం లోకల్‌ కాంటాక్టు వల్లే వస్తున్నాయి. వారం రోజులుగా నమోదవుతున్న కేసుల్లో, విదేశాల నుంచి వచ్చిన వాళ్లవి 30 శాతం మాత్రమే ఉంటుండగా, లోకల్‌ కాంటాక్టు ద్వారా 70 శాతం కేసులు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా.. ఢిల్లీలో ప్రార్థనా మందిరంలో మతపరమైన కార్యక్రమాలకు వెళ్లి వచ్చిన వారి వల్లే ఎక్కువ కేసులు నమోదవుతుండడం ఆందోళనకరం. 

ఢిల్లీకి వెళ్లిన వారిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి దాదాపు 300మంది:
ఢిల్లీలో ప్రార్థనలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి దాదాపు 300మంది వెళ్లినట్లు సమాచారం. వారిలో 150 మంది వివరాలు సేకరించారు. ఖైరతాబాద్‌ నుంచి ఇలా వెళ్లిన ఒకరు.. తీవ్ర అస్వస్థతతో మృతి చెందారు. ఆయన చనిపోయాక పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు తేలింది. కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చాక వైరస్‌ సోకిన లక్షణాలు కనిపించాయి. పరీక్షలు చేస్తే పాజిటివ్‌ వచ్చింది. అతడి నుంచి కుటుంబసభ్యుల్లో నలుగురికి వైరస్‌ సోకింది. దీంతో వైద్యశాఖ అధికారులు ఢిల్లీ ప్రార్థనా మందిరం నిర్వాహకులను సంప్రదించి.. ఆ కార్యక్రమానికి హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించారు. ఆ వివరాల ఆధారంగా ఆరా తీస్తున్నారు. 

హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి:
తెలంగాణలో అధిక శాతం కరోనా కేసులు హైదరాబాద్‌లోనే నమోదు అవుతుండగా, తర్వాత స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. తెలంగాణలో ఇప్పటి దాకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4, కరీంనగర్‌లో మూడు, వరంగల్‌ అర్బన్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 6 కుటుంబాలకు చెందిన 17 మంది వైరస్‌ బారిన పడ్డారు. కేవలం ఢిల్లీ వెళ్లడం ద్వారా మూడు కుటుంబాల వారు, తమ కుటుంబ సభ్యులకు వైరస్‌ అంటించారు. క్వారంటైన్‌లో ఉన్నవాళ్లలో సుమారు 18 వేల మందికి వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు ప్రకటించిన వైద్యారోగ్యశాఖ, వాళ్లకు పరీక్షలు మాత్రం చేయించలేదు. ఢిల్లీలో జరిగిన మత సదస్సుకు హాజరైన నేపథ్యం ఉండటంతో… అక్కడే వైర్‌సతో ‘కాంటాక్ట్‌’ అయ్యారనే నిర్ధారణకు వచ్చారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 76కి చేరింది. కరోనా మరణాల సంఖ్య 6కి పెరిగింది. నిన్న(మార్చి 30,2020) 13మందిని డిశ్చార్జ్ చేశారు. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న తెలంగాణ వారికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలో పర్యటించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో ఆరుగురు మరణించారు. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలోలో ఒకరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్ లో ఒకరు, గద్వాలలో ఒకరు చనిపోయారు.

నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిఘి-జమాత్ సభకు తెలంగాణ నుంచి 380 మంది హాజరైనట్లు అధికారులు గుర్తించారు.

తెలంగాణ నుంచి ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొన్నవారు, జిల్లాల వారీగా:
హైదరాబాద్ నుంచి 186 మంది
మెదక్ – 26 మంది
మహబూబ్ నగర్ – 25 మంది
వరంగల్ – 25మంది 
నల్గొండ – 21
నిజామాబాద్ – 18
ఖమ్మం – 15
ఆదిలాబాద్ – 10
రంగారెడ్డి – 15
కరీంగనర్ – 17
భైంసా – 11
నిర్మల్ – 11 మంది హాజరు.

కాగా, అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుదని అధికారులు అంచాన వేస్తున్నారు. ఢిల్లీలో ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఢిల్లీ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి వివరాలు యుద్ధ ప్రాతిపదికన సేకరిస్తోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు విధిగా తమ వివరాలు తెలపాలని అధికారులు కోరుతున్నారు. వారందరికి ప్రభుత్వమే ఉచితంగా పరీక్షలు, ట్రీట్ మెంట్ చేస్తుందన్నారు. మరోవైపు కరీంనగర్ లో మరో ఇద్దరికి కరోనా సోకింది. ఇండోనేషియా బృందంతో తిగిరిగి వ్యక్తికి గతంలో పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు సైతం కరోనా సోకింది. ఆ వ్యక్తి తల్లి, సోదరికి రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి కుటుంబంతో కలిసిన వారందరని ప్రభుత్వం ట్రేస్ చేస్తోంది.