హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవం : ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

  • Published By: veegamteam ,Published On : September 11, 2019 / 05:05 AM IST
హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవం : ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

హైదరాబాద్ నగర్ంలో సెప్టెంబర్ 12న గణేష్‌ శోభాయాత్ర అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వినాయకుడి శోభాయాత్ర కొనసాగే మార్గాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయనీ..ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు సూచించారు. 

పాతబస్తీ నుంచీ ఊరేగింపుగా వచ్చే గణనాథులు, కేశవగిరి అలియాబాద్‌, నాగుల్‌చింత నుంచి వచ్చే విగ్రహాలు.. చార్మినార్‌, మదీన, అఫ్జల్‌ గంజ్‌, ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, మీదుగా లిబర్టీ, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ లేదా ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్ చేరుకోవాలి. అలాగే టప్పాచబుత్ర అసిఫ్‌ నగర్‌ మీదుగా వచ్చే విగ్రహాలు సీతారాం బాగ్‌, బోయిగూడ కమాన్‌ మీదుగా గోషామహల్‌ అలస్కా నుంచి ఎంజే మార్కెట్‌ చేరుకోవాలి.

మరోవైపు సికింద్రాబాద్‌ నుంచే గణేషుల విగ్రహాలు ఆర్పీరోడ్‌, ఎంజీ రోడ్‌,కర్బలా మైదానం, కవాడీగూడ, ముషీరాబాద్‌, ఎక్స్ రోడ్‌ మీదుగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ చేరుకోవాలి. అక్కడి నుండి నారాయణగూడ చౌరస్తా, హిమాయత్‌ నగర్‌, వై జంక్షన్‌ మీదుగా లిబర్టీకి చేరుకోవాలి. అక్కడినుంచి ట్యాంక్‌బండ్‌పైకి చేరుకోవాలి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ డిస్టెన్స్‌ ఎడ్యూకేషన్‌ రోడ్‌, అడిక్‌మెట్‌ నుంచి.. విద్యానగర్ మీదుగా ఫీవర్‌ ఆస్పత్రి మార్గంలోని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. 

ఇకపోతే ఈస్ట్ జోన్ నుంచి వచ్చే వినాయకుడి విగ్రహాల ఊరేగింపు ఉప్పల్‌, రామంతాపూర్‌, ఛే నెంబర్ జంక్షన్‌, శివంరోడ్‌, ఓయూ ఎన్సీసీ గేట్‌, డీడీ హస్పిటల్‌, హిందీ మహా విద్యాలయ క్రాస్‌ రోడ్ మీదుగా.. ఫీవర్‌ ఆస్పత్రి, బర్కత్‌పురా చౌరస్తా, నారాయణ గూడ చౌరస్తా మీదుగా ట్యాంక్ బండ్‌పైకి చేరుకోవాలి.. అలాగే దిల్‌సుఖ్‌ నగర్‌ నుంచి వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఐఎస్‌ సదన్‌సైదాబాద్‌, చంచల్‌ గూడ, నల్లగొండ చౌరస్తా మీదుగా సరూర్‌ నగర్‌ చెరువును చేరుకోవాలి.

మెహిదీపట్నం దాటిన తరువాత వచ్చే ప్రాంతం టోలిచౌకి నుంచి వచ్చే విగ్రహాల ఊరేగింపు టోలిచౌకి, రేతిబౌలి, మెహిదీపట్నం, మాసబ్ టాంక్‌, అయోధ్య జంక్షన్, నిరంకారీ భవన్ మీదుగా.. పాత సైఫాబాద్ పీఎస్‌, ఇక్బాల్ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌ కు చేరుకోవాలి. అటు ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్సార్ నగర్‌, అమీర్ పేట, పంజాగుట్ట, వీవీ విగ్రహం దగ్గర నుంచి ట్యాంక్‌ బండ్‌కు చేరుకోవాలి.

ఈ క్రమంలో వినాయక విగ్రహాలు తరళివేళ్లే రూట్లలో ఇతర వాహనాలకు అనుమతి ఉండదనే విషయా ప్రజలు గనించాలి. గురువారం(సెప్టంబర్ 12) ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఈ  ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ అధికారులు తెలిపారు. మరోమైపు విగ్రహాల నిమజ్జనాన్ని బట్టి పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలను సడలించనున్నారు. అంటే కొంతవరకూ నిమజ్జనాలు జరిగిన తరువాత ట్రాఫిక్ సమస్య తగ్గుతుంటుంది కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు సడలించే అవకాశం ఉంటుంది. ఈ  నిమజ్జన వేడుకలు చూసేందుకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఖైరతాబాద్,  ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్‌, ఆనంద్ నగర్ జెడ్జీ ఆఫీస్, బుద్ధభవన్ వెనుక, గోసేవా సదన్, లోయర్ టాంక్ బండ్, కట్టమైసమ్మ టెంపుల్, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్ పార్కింగ్‌ చేసుకోవాలి. ఈ ట్రాఫిక్ ఆంక్షలను ప్రజలు గమనించి ఇబ్బందుల్లో పడకుండా జాగ్రత్త పడాలని పోలీసులు శాఖ సూచించింది.