ఏం జరిగింది : గచ్చిబౌలిలో బాలిక అనుమానాస్పద మృతి

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 05:17 AM IST
ఏం జరిగింది : గచ్చిబౌలిలో బాలిక అనుమానాస్పద మృతి

హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో  మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం (నవంబర్ 26)న 10 ఏళ్ల బాలిక నాగేశ్వరి కనిపించకుండా పోయింది.ఈ క్రమంలో బుధవారం ఉదయానికి నాగేశ్వరి మృతదేహం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మసీదు బండ సమీపంలో పడిఉంది. దీన్ని గమమనించిన స్థానికులు గచ్చిబౌలి  పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  బాలికను ఎవరైనా కావాలని కిడ్నాప్ చేసి హత్య చేశారా? మరేదైనా కారణాలు ఉన్నాయా అన కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

నాగేశ్వరి స్వగ్రామం మహబూబ్ బాగర్ జిల్లా వనపర్తిగా పోలీసులు గుర్తించారు. తమ కుమార్తె మంగళవారం  సాయంత్రం నుంచి కనిపించటంలేదని నాగేశ్వరి తల్లిదండ్రులు  మొగులయ్య, పద్మ దంపతులు తెలిపారు. కనిపించకుండాపోయిన బిడ్డ ఇలా శవమై కనిపిచంటంతో మొగులయ్య దంపతులు గుండెలు అవిసేలా విలపిస్తున్నారు. తమ బిడ్డ చావుకు కారణమైనవారిని కఠినంగా శిక్షంచాలని కోరుతున్నారు.