వీరు మారరు : తాగుతాం..రోడ్డెక్కుతాం

  • Published By: madhu ,Published On : January 19, 2019 / 01:25 AM IST
వీరు మారరు : తాగుతాం..రోడ్డెక్కుతాం

హైదరాబాద్‌ : ఎన్ని తనిఖీలు చేపట్టండి..పట్టుబడుతాం..ఛలాన్లు ఇచ్చేస్తాం..శిక్ష అనుభవిస్తాం..మళ్లీ తాగుతాం..రోడ్డెక్కుతాం…అంటున్నారు కొంతమంది మందుబాబులు. ఎందుకంటే పోలీసులు ఎన్ని తనిఖీలు చేపట్టినా పట్టబడుతూనే ఉన్నారు..తగ్గుముఖం పట్టడం లేదు. నగరంలోని కీలక ప్రాంతాలైన జూబ్లీహిల్స్…బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్‌లో తనిఖీలు చేపడుతుంటారు. ఈ విషయం తెలిసినా…మందుబాబులు మాత్రం మాకేం…అంటూ రయ్యి రయ్యిమంటూ వెళుతూ పట్టుబడుతున్నారు. 
జనవరి 18వ తేదీ రాత్రి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో 18 మందిపై కేసులు నమోదు చేశారు. 4 కార్లు, 14 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో యువతులు కూడా పట్టుబడుతున్నారు. మద్యం సేవించిన కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగుతుండగా…మరికొంత మంది తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిందపడిపోతున్నారు. ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా రోజురోజుకు డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.