ఇది ఇండియానా? అమెరికానా? : తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని

  • Published By: veegamteam ,Published On : March 30, 2019 / 03:54 AM IST
ఇది ఇండియానా? అమెరికానా? : తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని

హైదరాబాద్‌: తల్లిని బాగా చూసుకుంటామని చెప్పి మాటతప్పిన ఓ కొడుకు, కోడలిపై హైకోర్టు సీరియస్ అయ్యింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకపోగా.. వృద్ధురాలైన తల్లిని ఆస్తికోసం వేధించడంపై  తీవ్రంగా మండిపడింది. ఆమె నుంచి లాక్కున్న ఇంటిని తిరిగి అప్పగించేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. KPHB కాలనీ అడ్డగుట్టలోని శ్రీనిలయంలో నివాసం ఉండే వి.శివలక్ష్మీ పోలీసులను ఆశ్రయించింది. కొడుకు, కోడలు తనను ఇంట్లో నుంచి గెంటేయడమే కాకుండా, చంపేందుకు ప్రయత్నించారని KPHB పోలీసులకు 2018 అక్టోబర్‌ 31న ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు  తీసుకోలేదు. దీంతో ఆమె KPHB పోలీసులపై హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని, ఇంటిని ఆమెకే ఇచ్చేయాలని కొడుకు, కోడలిని ఆదేశించారు.
Read Also : గుడ్ న్యూస్ : పెద్దమ్మగుడి వద్ద మెట్రో ఆగుతుంది

తల్లిని బాగా చూసుకుంటామని వారిద్దరు ఆ సమయంలో న్యాయమూర్తికి తెలిపారు. కొన్ని రోజల తర్వాత కొడుకు, కోడలు నిజస్వరూపం బయటపెట్టారు. శివలక్ష్మీని పట్టించుకోవడం మానేశారు. అంతేకాదు కోర్టుకిచ్చిన హామీని నిలబెట్టుకోని వీరిద్దరు.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం.. కొడుకు, కోడలికి చీవాట్లు పెట్టింది.

ఇంటిని అప్పగించడంపై అప్పీల్‌ చేసే బదులు.. తల్లినే అడిగి ఎందుకు ఆశ్రయం పొందకూడదని నిలదీసింది. వాస్తవానికి జరిమానా విధించి ఈ అప్పీల్‌ను కొట్టేయాలని.. కానీ మానవతాదృక్పథంతో ఆ పని చేయడం లేదని తెలిపింది. తల్లి ఇంటిని ఆమెకే అప్పగించాలంది. ఈ ఉత్తర్వులను అమలు చేయకుంటే కొడుకు, కోడలుపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేయొచ్చని తల్లికి సూచించింది.
Read Also : హిజ్రాలే టార్గెట్: మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌

ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రుల దుస్థితిని వివరించింది. ఇటీవల తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రవర్తన బాధాకరంగా ఉందని న్యాయమూర్తి వాపోయారు. యువ దంపతుల్లో మానవతా విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో 1990ల్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు మన దేశంలో కనిపిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు మానసికక్షోభను అనుభవించారు, ఇప్పుడు మన దగ్గరున్న పరిస్థితులు కూడా అందుకు భిన్నంగా ఏమీ లేవు అని న్యాయమూర్తులు అన్నారు.
Read Also : భారీగా డబ్బు ఇస్తాం: బీజేపీ ఆఫర్!