మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల ముందు జరిగే ప్రక్రియ మొత్తం చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై తేలేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల కమిషన్ చెప్పిన విధానాన్ని పాటించాలని సూచించింది. దసరా సెలవుల అనంతరం మరోసారి మున్సిపల్ ఎన్నికల పిటిషన్పై హైకోర్టు విచారించనుంది.
హైకోర్టుకు దసరా సెలవుల దృష్ట్యా కేసుల విచారణకు అత్యవసర బెంచ్లను ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. అక్టోబర్ 9,10వ తేదీలలో డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. కాగా, దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3వ నుంచి 11వ తేదీ వరకు హైకోర్టుకు సెలవులు ఉంటాయని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.