8 నెలల క్రితం భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త

  • Published By: veegamteam ,Published On : February 28, 2020 / 06:38 AM IST
8 నెలల క్రితం భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసిన భర్త

ఓ వృద్ధుడు భార్యపట్ల చేసిన అరాచకపు పనికి ఆమెను ఇంటిలోనే 8 నెలలనుంచి బందీని చేసింది. భార్యను ఇంట్లో పెట్టి తాళం వేసి పత్తా లేకుండా పోయాడు ఓ వృద్ధ భర్త. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

వివరాల్లోకి వెళితే..గంగాధర్, బేబీ భార్యా భర్తలు. వారు వృద్ధులు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ పరిధిలోకి కృష్ణా జిల్లాకు చెందిన వృద్ధులు గంగాధర్, బేబీలు ఓ ఇంటిలోకి అద్దెకు వచ్చారు. గంగాధర్ వీఆర్ ఓగా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఈ క్రమంలో భర్త గంగాధర్ ఊరు వెళ్లే పని ఉంది..రేపు వచ్చేస్తానని చెప్పి..బేబీని ఇంటిలో పెట్టి బైట తాళం పెట్టి వెళ్లాడు. కానీ మరునాడు రాలేదు.రోజులు..వారాలు..నెలలు గడిచాయి. అయినా గంగాధర్ రాలేదు.

ఆమె భర్త కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఈక్రమంలో ఇంటి ఓనర్ తో పాటు ఇరుగు పొరుగు వారంతా బేబీకి కిటికీ నుంచి ఆహారం, నీళ్లు ఇస్తున్నారు. ఆ ఫుడ్ తిని బేబీ జీవనం సాగిస్తోంది గత ఎనిమిది నెలల నుంచి. ఎనిమిది నెలల నుంచి బేబీ ఇంటి అద్దె ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఆమె ఏమీ అనలేదు.పైగా ఆమెకు ఆహారం నీరు అందిస్తోంది. 

కానీ గంగాధర్ ఎంతకూ రాకపోవటంతో ఇంటి ఓనర్ గంగాధర్ కు ఫోన్ చేసింది. తనకు యాక్సిడెంట్ అయ్యిందనీ..త్వరలోనే వస్తానని తన భార్య బేబీని జాగ్రత్తగా తీసుకోమని కోరాడు. ఆ తరువాత కూడా గంగాధర్ రాలేదు. దీంతో ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు.  

వారు ఇంటికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఈ విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ బేబీ ఉంటున్న ఇంటికి వచ్చి పోలీసులతో తాళం పగుల గొట్టించి లోపలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వృద్ధాప్యం రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బేబీని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆమె కోలుకున్నాక వృద్ధాశ్రమానికి తరలిస్తామని తెలిపారు ఎమ్మెల్యే గోపాల్.