నాంపల్లి ఎగ్జిబిషన్ : నుమాయిష్ తిరిగి ప్రారంభం

  • Published By: madhu ,Published On : February 2, 2019 / 03:06 AM IST
నాంపల్లి ఎగ్జిబిషన్ : నుమాయిష్ తిరిగి ప్రారంభం

హైదరాబాద్ : నుమాయిష్ మళ్లీ ప్రారంభమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే టూ డేస్ క్రితం జరిగిన అగ్నిప్రమాదంలో 300కి పైగా స్టాళ్లు అగ్గికి ఆహుతుయ్యాయి. రూ. 33 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అక్కడ యదాతథస్థితికి చేర్చేందుకు ఎగ్జిబిషన్‌ను రెండు రోజుల పాటు మూసివేయనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ వెల్లడించింది. 

కూలిపోయిన షెడ్లు..కాలిపోయిన సామాగ్రీని తొలగించి శుభ్రం చేశారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం వరకు వంద స్టాళ్లను తిరిగి పునరుద్ధరించారు. కొల్పోయిన స్టాళ్లన్నింటినీ సొసైటీ తిరిగి నిర్మించి ఇస్తోంది. ఫిబ్రవరి 02వ తేదీ శనివారం నుండి నుమాయిష్ తిరిగి ప్రారంభం కానుంది. వీకెండ్ కావడంతో రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సొసైటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 4 అగ్నిమాపక శకటాలు, 26 మంది అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచారు.