కామకోరికలు తీర్చుకునేందుకు చోరీలు, 50ఏళ్లు దాటినా పాడు పనులు, పోలీసుల అదుపులో ఆ ఇద్దరు వెరైటీ దొంగలు

చోరీలు చేసిన వచ్చిన డబ్బుతో ఆకలి తీర్చుకునే దొంగలను చూశాం. దోచుకున్న సొత్తుతో జల్సాలు, ఎంజాయ్ చేసే వాళ్ల గురించి విన్నాం. కానీ, కామకోరికలు తీర్చుకునేందుకే చోరీల బాట పట్టిన దొంగలను చూశారా? కనీసం విన్నారా? అవును.. ఆ ఇద్దరు చోరాగ్రేసుల స్టైలే వేరు. వాళ్లు.. యువతులతో గడిపేందుకు, కామకోరికలు తీర్చుకునేందుకే దొంగతనాలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుకు రూ.15 వేలు యువతులతో గడిపేందుకు వెచ్చిస్తుంటారని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.

కామకోరికలు తీర్చుకునేందుకు చోరీలు, 50ఏళ్లు దాటినా పాడు పనులు, పోలీసుల అదుపులో ఆ ఇద్దరు వెరైటీ దొంగలు

Hyderabad Police Arrest Variety Thieves

hyderabad police arrest variety thieves: చోరీలు చేసిన వచ్చిన డబ్బుతో ఆకలి తీర్చుకునే దొంగలను చూశాం. దోచుకున్న సొత్తుతో జల్సాలు, ఎంజాయ్ చేసే వాళ్ల గురించి విన్నాం. కానీ, కామకోరికలు తీర్చుకునేందుకే చోరీల బాట పట్టిన దొంగలను చూశారా? కనీసం విన్నారా? అవును.. ఆ ఇద్దరు చోరాగ్రేసుల స్టైలే వేరు. వాళ్లు.. యువతులతో గడిపేందుకు, కామకోరికలు తీర్చుకునేందుకే దొంగతనాలు చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుకు రూ.15 వేలు యువతులతో గడిపేందుకు వెచ్చిస్తుంటారని తెలిసి పోలీసులే ఆశ్చర్యపోతున్నారు.

ఆ ఇద్దరు వెరైటీ దొంగలను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి ఇద్దరి వయసూ 50ఏళ్ల పైనే. ఈ వయసులోనూ యువతులతో గడిపేందుకు తహతహలాడుతున్నారు.

ఖైరతాబాద్‌ చింతలబస్తీకి చెందిన మల్లచెరువు రామారావు(52)పై 61 చోరీ కేసులు, రాజమండ్రికి చెందిన కోసూరి శ్రీనివాసరావు(54)పై 27 చోరీ కేసులున్నాయి. మేడిపల్లి పరిధిలోని బుద్ధనగర్‌లో తరచూ చోరీలు జరుగుతుండటంపై పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానిక సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి ఈ ఇద్దర్నీ గుర్తించారు. వీరికంటూ ప్రత్యేక ఇల్లు లేకపోవడం, లాడ్జీల్లోనే ఉండడం వల్ల పట్టుకోవడం కత్తిమీద సాములా మారింది. సోమవారం(మార్చి 8,2021) అర్ధరాత్రి చోరీ సొత్తుతో దర్జాగా వెళ్తుండగా మేడిపల్లి పోలీసులు అడ్డుకోగా, టీచర్లమంటూ బోల్తా కొట్టించేందుకు యత్నించినా తప్పించుకోలేకపోయారు.

తొలుత రామారావు ఆటోడ్రైవర్‌గా, శ్రీనివాసరావు ప్రైవేటు టీచరుగా పనిచేశారు. దొంగలకు సాయం చేసి ఇద్దరూ పోలీసులకు దొరికిపోయారు. వేర్వేరు ఘటనల్లో చోరీ సొత్తు విక్రయించి బోయిన్‌పల్లి పోలీసులకే ఇద్దరూ దొరకడం గమనార్హం. జైల్లోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత బయటకు వచ్చాక టీచర్లమంటూ ఐడీ కార్డులు చూపించి ముత్తూట్‌, మణప్పురం గోల్డ్‌ తదితర సంస్థల నుంచి లోన్లు తీసుకున్నారు. అలా వచ్చిన డబ్బులో 30 శాతం.. కామవాంఛ తీర్చుకునేందుకు.. మిగిలిన 60 శాతం పాత నేరస్తులను విడిపించేందుకు వినియోగించారు. బ్రహ్మదేవర రాజశ్రీ గణేష్‌ అలియాస్‌ విజయ్‌ ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. అతనిపై పీడీ చట్టం తొలగింజేసేందుకు గాను అతని భార్య సరితకు రూ.1.5 లక్షలు, చోరీ సొత్తును ఇచ్చారు.

ఖైరతాబాద్‌కు చెందిన మేళ్లచెరువు రామారావు(52), నేరేడ్‌మెట్‌కు చెందిన కోసూరి శ్రీనివాస్‌రావు(54) పాత నేరస్తులు. తెలుగు రాష్ట్రాల్లో 88 చోరీలు చేశారు. వీరికి చర్లపల్లి జైల్లో పీడీ యాక్టులో శిక్ష అనుభవిస్తున్న గణేశ్‌ పరిచయయ్యాడు. పీడీ యాక్టు తొలగించేందుకు, పీర్జాదిగూడలో ఉండే తన భార్య సరిత(27)కు డబ్బులు ఇవ్వాల్సిందిగా గణేశ్‌ వారిని కోరాడు. జనవరిలో విడుదలైన రామారావు, శ్రీనివాస్‌రావు సికింద్రాబాద్‌లో లాడ్జిలో ఉంటూ చోరీలు చేస్తున్నారు. చోరీ సొత్తును సరితకు ఇస్తున్నారు.

సోమవారం రాత్రి మేడిపల్లి పీఅండ్‌టీ కాలనీలోని కాకతీయ ఆసుపత్రి సమీపంలో ఇద్దరూ బైక్ పై వెళ్తూ గస్తీ పోలీసులకు చిక్కారు. స్టేషన్‌కు తరలించి విచారించగా చోరీల చిట్టా విప్పారు. సరితతో పాటు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరకిలో చొప్పున వెండి, బంగారు ఆభరణాలు, 2 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.