రా.1 గంట వరకే.. డీజేకు నో పర్మిషన్ : న్యూఇయర్ వేడుకలకు పోలీసుల నిబంధనలు

మరికొన్ని గంటల్లో నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 03:07 AM IST
రా.1 గంట వరకే.. డీజేకు నో పర్మిషన్ : న్యూఇయర్ వేడుకలకు పోలీసుల నిబంధనలు

మరికొన్ని గంటల్లో నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన

మరికొన్ని గంటల్లో నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతున్నాం. దీంతో సెలబ్రేషన్స్ కు అంతా రెడీ అవుతున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఉత్సాహంగా గడుపుతారు. పార్టీలు చేసుకుంటారు. అర్థరాత్రి కేక్‌ కట్ చేసి విషెస్ జరుపుకుంటారు. ఇక యువత గురించి చెప్పనక్కర్లేదు. వాళ్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు. బైక్ లు, కార్ల మీద తిరుగుతూ న్యూ ఇయర్ కి వెల్ కమ్ చెబుతారు. కేరింతల్లో మునిగితేలుతారు. 

న్యూఇయర్ సెలబ్రేషన్స్ రోజున ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. ఏటా వీటిని తగ్గించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఈసారి కూడా అందుకోసం రూల్స్ తీసుకొచ్చారు. 2020 వేడుకల్లో… రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశ్రుతులకు ఆస్కారం లేకుండా.. ప్రశాంతంగా నిర్వహించేందుకు రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించారు. పోలీసులు జారీ చేసిన నిబంధనలను ఈవెంట్స్‌ నిర్వాహకులు, హోటల్స్‌, పబ్‌ యాజమాన్యాలు, ఇతరులు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. మహిళలకు పటిష్ట భద్రత, రోడ్డు ప్రమాదాల్లో మరణాలను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా.. రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు విజన్‌ 2020 లక్ష్యాలను వివరించారు.

న్యూ ఇయ‌ర్ సమయంలో హ్యాపీగా వేడుకలు జరుపుకుంటే పర్లేదు. కానీ వేడుకల పేరుతో రచ్చ చేయడం, గొడవలకు దిగడం, అమ్మాయిలను ఏడిపించడం వంటి పిచ్చి పనులు చేస్తే మాత్రం తాట తీస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ అతిక్రమిస్తే… జైల్లో పెడతామన్నారు. ఈసారి బాణసంచా కాల్చినా, బార్లు పబ్బుల్లో అశ్లీల వేషాలు వేసినా చర్యలు తప్పవు. ఇక మందుబాబులకు బిగ్ షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. డిసెంబర్ 31 రాత్రి.. తాగి వాహనాలు నడిపుతూ దొరికితే రూ.10వేలు ఫైన్ వేస్తామన్నారు. అంతేకాదు వాహనాన్ని సీజ్ చేస్తారు. నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి దుర్ఘటనలు జరక్కుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాద రహితంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు జంట నగరాల కమీషనర్లు పలు నిబంధనలను రూపొందించారు.

డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో పాటించాల్సిన నిబంధనలు:
* నూతన సంవత్సర వేడుకులను రాత్రి 8 నుంచి 1 గంట వరకే నిర్వహించాలి.
* వేడుకల నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోవాలి.
* వేడుకలు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
* డీజేకు అనుమతి లేదు, 45 డెసిబెల్స్‌ మ్యూజిక్‌ శబ్దం మించకూడదు.
* డ్రగ్స్‌, మత్తు పదార్థాలు విక్రయించవద్దు.
* ట్రాఫిక్‌ రద్దీ, జామ్‌లు తలెత్తకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి.
* ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలి.

* మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. వేడుకల్లో అశ్లీలం ఉండవద్దు.
* మైనర్లకు ఈవెంట్స్‌ జరిగే ప్రాంతాల్లో మద్యం సరఫరా చేయొద్దు.
* వేడుకల సందర్భంగా గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు తాగొద్దు.
* మహిళలు, పిల్లలను నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే వేడుకలకు పంపొద్దు.
* క్యాబ్‌, ఆటో డ్రైవర్లు అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్‌ 100, లేదా హాక్‌ ఐ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలి.
* వేడుకల ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ నేరమని సూచిక బోర్డులు పెట్టాలి.

* డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా, వాహనం సీజ్‌.
* సైబరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యలు ఎదురైతే సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ వాట్సాప్‌ నం. 850-041-1111 కు సమాచారం ఇవ్వాలి.
* అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా, వస్తువులు కనపడినా వెంటనే డయల్‌ 100 లేదా రాచకొండ వాట్సాప్‌ నం. 949-061-7111, సైబరాబాద్‌ వాట్సాప్‌ నం. 949-061-7444 కు సమాచారం అందించాలి.

డిసెంబర్‌ 31, న్యూ ఇయర్‌ వేడుకలను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఆర్‌పై రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాలకు అనుమతి లేదని రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు మహేశ్‌ భగవత్‌, సజ్జనార్‌లు స్పష్టం చేశారు. దీంతో పాటు రెండు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించరు.ఇవండి.. పోలీసులు విధించిన కొత్త రూల్స్. సో.. బీ కేర్ ఫుల్. ఎక్కడా హద్దులు దాటకుండా న్యూఇయర్ వేడుకులను సంతోషంగా సెలబ్రేట్ చేసుకోండి.