శాసనమండలి నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ 22 ఆదివారం బడ్జెట్ పద్దులకు ఆమోదం తెలిపిన అనంతరం శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు.
శాసనమండలి సమావేశాలు ఐదు రోజుల పాటు జరిగాయి. ఈ ఐదు రోజుల కాల వ్యవధిలో 17 గంటల 37 నిమిషాల పాటు చర్చలు సాగాయి. ఈ సమావేశాల్లో శాసనమండలి 3 బిల్లులను ఆమోదించింది.