కాచిగూడ రైలు ప్రమాదం : కాపాడాలని డ్రైవర్ ఆర్తనాదాలు

కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో విషాదం నెలకొంది. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ శేఖర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇంజిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రాణాలు

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 06:20 AM IST
కాచిగూడ రైలు ప్రమాదం : కాపాడాలని డ్రైవర్ ఆర్తనాదాలు

కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో విషాదం నెలకొంది. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ శేఖర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఇంజిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ప్రాణాలు

కాచిగూడ రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదంలో.. ఎంఎంటీఎస్ డ్రైవర్ ఇంజిన్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయాడు. తనని కాపాడాలంటూ డ్రైవర్ ఆర్తనాదాలు చేస్తున్నాడు. రెస్క్యూ సిబ్బంది డ్రైవర్ ని బయటికి తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉదయం 11.30 గంటల సమయంలో రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆగి ఉన్న హంద్రీ ఎక్స్ ప్రెస్ ని ఎంఎంటీఎస్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30మందికి గాయాలు అయ్యాయి. వీరిలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ప్రమాదం జరిగింది.

రైలు ప్రమాదంలో మూడు బోగీలు పక్కకి ఒరిగాయి. దీంతో ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారు. పట్టాలు తప్పిన బోగీలను తిరిగి ట్రాక్ పైకి తీసుకొచ్చే పనులు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ కి చెందిన 5 బోగీలు, ఇంటర్ సిటీకి చెందిన 3 బోగీలు ధ్వంసం అయ్యాయి.

రైలు ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణం అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. టెక్నికల్ ఇష్యూ కారణంగా ఇంటర్ సిటీ ట్రైన్ ఆగి ఉన్న ట్రాక్ పైకి ఎంఎంటీఎస్ రైలు కూడా వచ్చేసింది. దీంతో యాక్సిడెంట్ జరిగింది. దీనిపై రైల్వే అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.