దిల్‌రాజు షూటింగ్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి

  • Published By: vamsi ,Published On : March 14, 2019 / 01:45 AM IST
దిల్‌రాజు షూటింగ్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న సినిమా సెట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. సినిమా సెట్టింగ్‌లో కరెంట్ షాక్‌తో అక్కడ పనిచేస్తున్న కార్పెంటర్ చనిపోయాడు. కృష్ణానగర్‌కు చెందిన మెట్టు కాంతారావు అనే వ్యక్తి కొంత కాలంగా సినిమా సెట్టింగ్‌‌లకు సంబంధించిన పనులు చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల్లో నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఓ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా అందులో పనిచేస్తున్నాడు.
Read Also : విప్రో చైర్మన్‌ గొప్ప మనసు: రూ.52,700 కోట్ల విరాళం

అయితే సెట్ కోసం మిషన్‌తో చెక్కలను కోస్తున్న మెట్టు కాంతారావుకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.