కొరటాలతో సినిమా టైటిల్ చెప్పేసిన చిరంజీవి.. ఆ తర్వాత సారీ కూడా చెప్పారు
కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టైటిట్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టైటిల్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. దీనికి
కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టైటిట్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టైటిల్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. దీనికి
కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని టైటిట్ పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. టైటిల్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. దీనికి మెగాస్టార్ చిరంజీవి తెరదించారు. స్వయంగా ఆయనే టైటిల్ చెప్పేశారు. సినిమా పేరు ”ఆచార్య” అని చిరంజీవి రివీల్ చేశారు. ”ఓ..పిట్ట కథ” సినిమా ప్రి రిలీజ్ వేడుకలో చిరంజీవి ఈ విషయం చెప్పారు. ఆ వెంటనే డైరెక్టర్ కొరటాలకు చిరు సారీ కూడా చెప్పడం విశేషం. సినిమా పేరు బయటపెట్టేసినందుకు చిరంజీవి సారి చెప్పారు.
నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ’. చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. విశ్వంత్, నిత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం(మార్చి 1,2020) హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు.
‘‘ఈ మధ్య చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. దయచేసి చిన్న సినిమాలనూ ఆదరించాలని పంపిణీదారులను కోరుతున్నా. ఇక నటుల విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలో సానుకూల దృక్పథం చాలా అవసరం. కష్టాల్లో ఉన్నప్పుడు దృఢంగా ఉన్నవాళ్లే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతారు. కొత్త తరం నటులకు ఇది చాలా అవసరం. ఈ సినిమా హీరో సంజయ్.. నేవీ ఉద్యోగం వదులుకొని సినిమాల్లోకి వచ్చాడని విన్నా. నేను కూడా నేవీని వదులుకొని వచ్చిన వాడినే. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్ ఉంటుంది.
బ్రహ్మాజీ వంటి నటుడు ఇంట్లో ఉండటం సంజయ్ అదృష్టం. ఇక నిత్యా శెట్టి గురించి చెప్పాలంటే.. ఆమె అంజి సినిమాలో చేసిన బాలనటి అని నాకు ఇప్పుడే తెలిసింది. ఆమె పేరు విని ఎవరో ముంబై నుంచి వచ్చిన హీరోయిన్ అనుకున్నా. కానీ, నిత్య అచ్చమైన తెలుగమ్మాయిలా ఉంది. చూస్తుంటే యాంకర్ సుమకు పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా బ్రహ్మాజీ, సంజయ్తో పాటు నిర్మాత ఇతర నటీనటులందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు. ఇటీవల మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు కుటుంబానికి భవ్య క్రియేషన్స్ తరఫున రూ.2లక్షల చెక్కును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందించారు.